Saturday, December 27, 2008

స్వామి గురించి

శ్రీ జన్నాభట్ల వేనుగోపాల కృష్ణమూర్తి, ఎం.ఎస్‌.సి, పి.హెచ్.డి., కెమిస్ట్రీ ప్రొఫెసర్ భక్తుల చేత 'స్వామి' లేక 'దత్తస్వామి' గా పిలువబడుతున్నారు. నేటి తరానికి అధ్యాత్మిక తత్త్వమును బోధించాలంటే "సైన్సు అంటే నవీన తర్క శాస్త్రము కావాలి" అంటారు స్వామి. స్వామి 19 సంవత్సరముల వయస్సులో పి.హెచ్.డి డిగ్రీని పొందినారు. 11వ ఏటనే సంస్కృతములో వందకు పైగా గ్రంధములు వ్రాసినారు. ఈ గ్రంధాలలో శంకర-రామానుజ-మధ్వ గురుత్రయము యొక్క భాష్యాలను సమన్వయము చేసి మూడింటిలోను ఒకే సిద్ధాంతమున్నదని నిరూపించినారు. ఉత్తర-దక్షిణ భారత దేశంలో 12 సంవత్సరాలు సంచరించి అనేక పండితులతో వాదోపవాదములు చేసినారు. స్వామి ఇచ్చిన దివ్య ఉపన్యాసాలు "జ్ఞాన సరస్వతి" శ్రీర్షిక కింద అనేక గ్రంధాలుగా ముద్రించబడినవి. స్వామి ఆశువుగా చెప్పిన భక్తిగీతాలను "భక్తిగంగ" అను గ్రంధముగా ముద్రించబడినవి. స్వామి దత్తవేదము, దత్తభగవద్గీత, దత్తోపనిషత్తులు, మొదలగు పవిత్ర గ్రంధములను అందించినారు. స్వామి చేసిన దివ్య మహిమలు "మహిమ యమున" అను గ్రంధముగా ప్రచురించబడినవి. దత్తసేవకు మూల స్తంభములగు శ్రీ చిలుకూరు బాలకృష్ణమూర్తిగారు, భవాని గారు అందరికీ చిరస్మరణీయులు.

"అన్నార్తులకు అన్నము, జ్ఞానార్తులకు జ్ఞానము, భక్తిని పంచినచో ఆ సేవ నిజముగా మీ లెక్కలోనికి చేర్చబడును" అంటారు స్వామి. భక్తులు స్వామిని దత్తావతారముగా గుర్తించి విశ్వసిస్తున్నారు. స్వామి ప్రసాదించిన అనేక దివ్య ఉపన్యాసాలను ఈ బ్లాగు ద్వారా పొందగలరు. ఈ దత్తసేవలో పాల్గొని ఇతర భక్తులు కూడా శ్రీ దత్త ప్రభువుల యొక్క అనుగ్రహమును, ఆశీస్సులను పొందుదురుగాక!
శ్రీ దత్తప్రభువు ఒక్కరే ఈ విశ్వమునకు గురువుగా, పరమాత్మగా ఉన్నారు గదా.

At Lotus feet of Shri Dattaswami
-Durgaprasad

No comments:

Post a Comment