Friday, December 18, 2009

తన్మయాహితే

శ్రీ దత్త సద్గురువుని ఉపదేశము మరియు ప్రవర్తన మానవుని యొక్క అసూయ, అహంకారము, మమకారముల ప్రమాణములపై ఆధారపడి యున్నది. మానవుడు ప్రత్యక్షమును వర్తమానమును ఓర్చుకొనజాలడు. అందులోను తన స్వరూపము వంటి సాటి మానవుని ఎట్టి పరిస్ధితులలోను సహించజాలడు. కావున పరమాత్మ సాటి మానవునిగా వచ్చినపుడు మానవుడు గుర్తించుట చాలా కష్టము. ఆ సాటి మానవుని స్వరూపము పరోక్షముగా వైకుంఠముననో, కైలాసముననో ఉండినచో కొంత సహించగలడు. ఆ సాటి మానవుని స్వరూపము వర్తమాన కాలములో కాక గతించిన కాలములో ఉన్నచో అదియైనను సహించగలడు. వర్తమానములో సాటి మానవునిగా ఎదురుగా కనపడుచూ ఎట్టి మహిమలను చూపక సామాన్య మానవుని వలె ప్రవర్తించుచున్నను అట్టి రామునే దైవమని విశ్వసించి సేవించుచూ, తాను ఎట్టి మహిమలను చూపగలిగినను, తాను దైవమని భావించక యున్న హనుమంతుడు ఎంత గొప్పవాడో ఆలోచించుడు. రాధయును అట్లే వర్తమాన కాలమున ప్రత్యక్షముగా యున్న నవ స్వరూపమును ఆరాధించినను, కృష్ణుడు మహిమలను ప్రదర్శించినాడు. రాధ వద్ద ఎట్టి మహిమలు లేవు. కావున రాధ కృష్ణుని గుర్తించుట కన్నను హనుమంతుడు రాముని గుర్తించుట చాలా కష్టమైనది. కాన రాధ యొక్క జ్ఞానము, హనుమంతుని జ్ఞానము కన్న తక్కువ. అందువలనే హనుమంతుడు చతుర్ధశ భువనములకు అధిపతియై అందరి చేతను ప్రత్యేక దేవాలయములలో పూజింపబడుచున్నాడు. కాని రాధకు అట్టి దేవాలయములు లేవు. కావున హనుమంతుడు రాధకన్న గొప్పవాడు. దేనిలో? జ్ఞానములో. కాని రాధ యొక్క మార్గము చాల కష్టమైనది. ఆమె యొక్క ప్రేమ నరకమునకు కూడా భయపడలేదు. కనుక భక్తిలో హనుమంతుని కన్న రాధ గొప్పది. కావుననే పదునాలుగు భువనములకు పై నున్న గోలోకమునకు మహారాణి అయియున్నది. హనుమంతుని మార్గము దాస మార్గము. ఇది చాలా సులభమైనది. కాని రాముని గుర్తించుట చాల కష్టము. కాన గుర్తింపు చాల గొప్పయైనది. కాని రాధ యొక్క ప్రియ మార్గము చాల కష్టమైనది.

కావున మార్గము గొప్ప గుర్తింపు సులభము. కావున ఇరువురును సమ ఉజ్జీలే. పొందిన ఫలములు సమానమే. ఇంత అత్యుత్తమ ఫలమును ఇరువురును సమానముగా పొంది యున్నారు. కావున వారి సాధనలు కూడ అత్యుత్తమములై యుండవలెను. సాధనలో ప్రధాన అంశము ఏది? నీకు అత్యుత్తమ స్ధితిని అందించగల అత్యుత్తమ దైవ స్వరూపమును ఎన్నుకొనుటయే ప్రధానాంశము. ఏల యనగా అత్యుత్తమ ఫలప్రదాత ఆ దైవ స్వరూపమే కదా! వారిరువురు అత్యుత్తమ ఫలమును పొందినారు అన్నప్పుడు వారు అత్యుత్తమ దైవ స్వరూపమును ఎన్నుకున్నట్లే గదా! కావున వారు ఎన్నుకున్న అత్యుత్తమ దైవ స్వరూపము ఏది? ఆ దైవ స్వరూపము వారున్న వర్తమాన కాలములో వారికి ప్రత్యక్షముగ యుండి వారికి అందివచ్చిన బ్రహ్మమగు రామావతారము, కృష్ణావతారములే గదా. వారిరువురును (నరాకారములగు) ఎప్పుడును పరోక్షములగు నరాకారములగు విష్ణు, శివాది రూపములను ద్యానించినట్లు ఆరాధించినట్లు వినబడలేదు. ఇంత కన్న క్రియాత్మకమైన ప్రమాణము ఏమి కావలయును? వారిరువురు గతించిన నరాకారములను కూడా ధ్యానించలేదు.

హనుమంతుడు అప్పటికి గతించిన పరశురామ, వామన, నరాసింహాది అవతారములను ధ్యానించలేదు. అట్లే రాధ అంతకు ముందు గతించిన రామావతారమును ధ్యానించలేదు. దీనికి గల కారణము ఒక్కటే. ఆ ఇరువురిలోను అసూయ సంపూర్ణముగా నాశనమై యున్నవి. దత్తుడు అనసూయ గర్భము లోనికి మాత్రమే ప్రవేశించును. కనుక అసూయ లేని వారికే చిక్కును. అందివచ్చిన వర్తమాన నరాకారమునే ఉపాసించవలయునని నాలుగు వేదములు నాలుగు మహావాక్యముల ద్వారా బోధించుచున్నవి. శివశక్తి స్వరూపమే శిరిడి సాయిగా, సత్యసాయిగా అవతరించినది. కొందరు వర్తమానుడగు సత్యసాయిని నమ్మక గతించిన శిరిడి సాయినే నమ్ముదురు. నరాకారమున ఈ లోకమున స్వామి అవతరించుట నమ్మని మరికొందరు ఈ ఇరువురిని నమ్మక నరాకారములనే కలిగిన పరోక్షమున యున్న కైలాసవాసులైన పార్వతి పరమేశ్వరులను నమ్ముచున్నారు. కావున ఈ మత భేదము లన్నియు మానవునిలో గల అసూయ యొక్క ప్రమాణము మొదలగు భేదము మీద ఆధారపడి యున్నది. ఇంకనూ అందరి కన్నను అసూయ ఎక్కువ కలవాడు అసలు ఆకారమునే కొట్టివేసి నిరాకారమైన సర్వవ్యాపకమైన చైతన్యము వంటి శక్తిని దైవ స్వరూపముగా అంగీకరించును. కావున నిరాకారవాదులు మూడు కిలోల అసూయ కలవారు. పరోక్షసాకారాదులు అనగా కైలాస వాసులైన పార్వతి పరమేశ్వరులను మాత్రమే అంగీకరించు వారు రెండు కిలోల అసూయ కలవారు. భూలోక నరాకారమును అంగీకరించు సాకారవాదులు ఒక కిలో అసూయ కలవారు. గతించిన నరాకారమైన శివశక్తి అవతారమైన షిరిడి సాయిని మాత్రమే నమ్ముదురు. వీరిలో అరకిలో అసూయ కలవారు వర్తమాన నరావతారమైన సత్య సాయిని విశ్వసింతురు. ఆ అరకిలో అసూయ కూడ లేనివారు సత్య సాయిని చేరి ఆయన తలపెట్టిన కార్యములో పాల్గొని ఆయన సేవకులుగా తరించుదురు. అట్లే శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీయును వర్తమాన దత్తావతారులే. వర్తమానములో శ్రీ దత్తుడు ఎందరో మహానుభావులైన నరావతారములను దాల్చి అందరకిని వారున్న ప్రదేశములలోనే అందుచున్నాడు.

కనుక భగవంతుని అందుకొనుటకు మనము ఎట్టి ప్రయత్నము చేయనక్కరలేదు. శ్రీ దత్త పాదము ఇంటింటికి తిరుగును. చేయవలసినదేమి? అనగా ఆయన ఉపదేశములను అనుసరించి ఆయన సేవలో పాల్గోనుటయే నీవు చేయవలసిన పని. కాని నీవు అక్కర లేని పనియగు భగవద్ప్రాప్తికై ప్రయత్నించుచున్నావే కాని అవసరమైన స్వామి సేవ చేయకున్నావు. అనవసరమైన పనిని చేయుట, అవసరమైన పనిని చేయకుండుట మానవుని నైజము. ఈ మత భేధములలో అసూయతో పాటు మానవునిలో లోభ గుణము గూడా వివిధ ప్రమాణములలో తాండవించుచున్నది. నిరాకారవాదులలో మూడు కిలోల లోభము ఉన్నది. దీపారాధన కూడ వారు చేయరు. ఏలననగా, ఆకారమును అంగీకరించినచో విగ్రహము వద్ద దీపారాధన ఖర్చు చేయవలసి వచ్చును. విగ్రహముల యొక్క ముఖము ప్రత్యేకముగా, స్పష్టముగా కనిపించుట కొరకే దర్శనమునకు సహకరించు విధముగా దీపారాధన నీరాజనము చేయబడుచున్నది. ఇది ఇంటిలో అక్కరలేదు. గర్భగుడిలో చీకటిగా యుండును కావున దీపారాధన చేయబడుచున్నది. ఐతే నిరంతరము ఒక లైటు వెలిగించి ఉంచవఛ్ఛును గదా అన్నచో మానవ స్వభావమునకు ఉన్న గుణము ఏమనగా, నిత్యము కనిపించినచో వెగటు పుట్టును. గర్భగుడిలో చీకటిలో కనిపించక, స్పష్టమైన దర్శనము కొరకు ఉత్కంఠముతో వేచియుండగా ఒక్క క్షణకాలము నీరాంజన జ్వాల కాంతులలో స్వామి స్వరూపము గోచరించినపుడు స్వామిపై శ్రద్ధ ఎక్కువగా నుండి విలువ పెరుగును. ఏలననగా మానవుని యొక్క అసూయ దీనికి కారణమగుచున్నది. నిత్యము గోచరించు దానిని నిర్లక్ష్యము చేయుదురు. ఎప్పుడొ కనిపించినచో విలువ యుండును. రాకరాక వచ్చిన ఒక బంధువు జీవుడైననూ వానికి విలువ నిత్తురు. నారాయణుడైనను నిత్యమము కనిపించుచున్నచో నిర్లక్ష్యము చేయుదురు.
నిత్యము కనిపించు కృష్ణ పరమాత్మను నిర్లక్ష్యము చేసి కృష్ణుని ఆదేశములను పాటించక యాదవులు మద్యము త్రాగి నశించిరి. అప్పుడప్పుడు వచ్చి కనిపించు కృష్ణ పరమాత్మ ఆజ్ఞలను పాండవులు ఆచరించిరి. ఐతే మానావమానములకు భగవంతుడు అతీతుడు గదా! అన్నచో, భక్తులు చేయు నిర్లక్ష్యము వలన స్వామికి ఎట్టి నష్టము లేదు. భక్తులకే నష్టము కలిగించినది. భక్తుల యొక్క నష్టము, భక్తులకు కలిగించు బాధ కన్నను, కరుణామయుడైన పరమాత్మకే ఎక్కువ బాధకలిగిస్తుంది. కావున భక్తుల శ్రేయస్సు కొరకే నిరంతర దర్శనము మంచిదికాదని ఇట్లు చేయుట జరుగుచున్నది. ఇక సాకారవాదులలో రెండుకిలోల లోభమున్న వారు మరియు ఒకకిలో లోభమున్న వారు విష్ణు శివాది రూపములను లేక శిరిడి సాయి రూపమును విగ్రహములుగా పటములుగా పూజించుచున్నారు. ఈ ఆరాధనలో ధూపదీపాదులకు స్వల్పమైన ఖర్చు మాత్రమే అగుచున్నది. అంతే కాక విగ్రహము వద్ద పెట్టిన దీపము యొక్క కాంతి ఆ గది లోనికి ప్రవేశించి మనకు దీపముగా కూడా సాయపడుచున్నది కదా. సుగంధ ధూపమును మనమే ఆఘ్రాణించుచున్నాము గదా. కనుక నష్టము లేదు. ఇందులో ముఖ్యముగా పెట్టిన నైవేద్యము పటములు స్వీకరించుట లేదు. కనుక ఖర్చు తగ్గుతున్నది. ఇక అరకిలో లోభమున్న వాడు ప్రత్యక్ష నరాకారమును విశ్వసించి ఆయనకు నైవేద్యము అర్పించి వ్యక్తిగత సేవలో పాల్గోనుచున్నాడు. ఆ అరకిలో లోభము కూడ పూర్ణముగ నశించిన వాడు స్వామి యొక్క కార్యములో పాల్గోని జ్ఞాన భక్తి ప్రచారసేవలో తాను కష్టించి ఆర్జించిన ధనములో ఎక్కువ భాగము వ్యయము చేయుచున్నాడు. నైవేద్యసేవ కన్నను ఈ సేవలో ఖర్చు ఎక్కవ గదా. కావున ఇట్లు అసూయ లోభముల యొక్క భిన్న ప్రమాణముల యొక్క నృత్యమునే భిన్న మతములు. ఐతే ఈ అసూయ లోభములనను మానవుడు అంగీకరించడు. వాని అంతరాత్మ తెలిసియున్ననూ బహిరంగముగా అంగీకరించడు. అవి బయిటపడి అంగీకరించనిచో తన అహంకారము దెబ్బతిను చున్నది. మానవుని యొక్క అసూయను పట్టియే స్వామి యొక్క దశవతారములున్నవి. "ప్రజ్ఞానం బ్రహ్మ" - బ్రహ్మము జీవుడుగా వచ్చును. కాని ఆ జీవుడు భూమిపై కనిపించరాదు. ఇది పదికిలోల అసూయ. కావుననే స్వామి భూమి మీద కనిపించక జలములో మత్స్య రూపములో అవతరించినాడు. ఒక కిలో అసూయ తగ్గగా, అప్పుడప్పుడు భూమి మీదకు వచ్చు కూర్మావతారము ఎత్తినాడు. మరియొక కిలో అసూయ తగ్గగనే ఎప్పుడు భూమిపై నుండు వరాహవతారము ఎత్తినాడు. భూమిపై నిత్యము కనిపించుచున్నను సాటి నరాకారమును అంగీకరించని స్ధితిలోనే యున్నాడు. వానికి మరియొక కిలో అసూయ తగ్గినది. పూర్తి నరాకారమును అంగీకరించలేడు.

నరాకారములో ముఖము ప్రధానము. కావున పరమాత్మ నరసింహ ముఖమును ప్రదర్శించినారు. తరువాత వానిలో మరియొక కిలో అసూయ తగ్గినది. పూర్ణ నరాకారమును అంగీకరించినాడు కాని తన కన్న అధముడుగా యుండవలెను. స్వామి పూర్ణ నరాకారముగా వామనుడుగా వచ్చినాడు. వామనుడు అనగా పొట్టివాడు అని కాదు. ఒక మానవుడు ఉచ్చదశలోకి పోయినప్పుడు ఎంత ఎక్కువకు ఎదిగినాడందుము. అనగా 7 అడుగులు పెరిగినాడని అర్ధము కాదు. ఈ స్ధితిలో జీవుడు బలియను దానవునిగా చెప్పబడినాడు. బలి అనగా అహంకారి అని అర్ధము. భగవంతుని చేయి క్రింద వుండి తన చేయి పైన ఉండు స్ధితిని కోరుకున్నాడు. కావుననే వామనుడుగా వచ్చినాడు. అనగా అధముడుగా వచ్చి స్వామి క్రమక్రమముగా విజృభించింనాడు. అనగా ఎత్తు పెరుగుట కాదు. తన యొక్క పరమాత్మ తత్త్వమును ప్రకటించినాడు. ఒక పదము చేత ఆకాశమును మరియొక పదము చేత భూమిని ఆక్రమించినాడు. ఇక్కడ పదము అనగా శబ్ధము, వాక్కు, బోధ. అనగా తన బోధ చేత ఆకాశమునాశ్రయించుట అనగా ఉత్తమ సాధకులను బోధ ద్వారా ఆక్రమించినాడు. మద్యములగు భూలోక స్ధాయిని కూడా బోధచే ఆక్రమించి ఉద్దరించినాడు. ఇక అధములు అనగా పాతాళము మిగిలినది. నేను అధమ స్ధితిలో వచ్చి ఎంత ఉచ్చ స్ధితికి ఎదిగినాడొ చూపుటకు బలి తలలోకి బోధ ద్వారా జ్ఞానము నెక్కించినాడు. మూడవ పదమును బలి శిరస్సుపై యుంచుట ఇదియే. బలి ఆట్టి అధమ స్ధితిలో ఉంచి తన అహంకారమును నిర్మూలించమని ప్రార్ధించినాడు. ఇదే బలి పాతాళమునకు త్రొక్కపడుట. అనగా బలి అహంకారమును వదలి అధమ స్ధితిలో తన్ను తాను తగ్గించుకున్నాడు. నిన్ను నీవు ఎంత తగ్గించు కొందువో అంత హెచ్చింపబడుదువు అని విదేశములో అవతరించినపుడు శ్రీ దత్తుని వాణి గదా. కావున బలి ఎంత హెచ్చింపబడినాడు అనగా ఆ బలికి తాను దాసుడై స్వామి గేటు కాపరిగ నిలబడినాడు. అనగా వామనుడుగా ఉన్నవాడు ఎవడైనను తప్పక త్రివిక్రముడగును. కావున అహంకారము ఎంత నిర్మూలించుకున్న అంత ఉచ్చస్ధితి లభించును. ఈ స్ధితిలో మానవుడు పరమాత్మను ప్రశ్నించినాడు. స్వామీ! గర్భములో ఏర్పడిన ఒక శిశు స్వరూపమును తాము ఆవేశించి అవతరించి పూర్ణావతారముగ ఉన్నారు. అట్లు కాక తమ భక్తుడగు ఒక మానవుని ఆవేశించినపుడు అతడు కూడ అవతారము కావచ్చును గదా. ఒక లోహపు తీగె నిర్మించబడగనే దానిని లైటుకు బిగించి విద్యుత్తును పంపినట్లు ఎట్లు విద్యుత్తీగె అగుచున్నదా. అట్లే లోహపు తీగె నిర్మించబడిన కొంత కాలము తరువాత దానిని బిగించి, విద్యుత్తును పంపినచో అదియును విద్యుత్తీగె అగును కదా అని ఈ ప్రశ్నను నారదుడు వేసినాడు.

"తన్మయాహితే" అను భక్తి సూత్రమున భక్తుని గూడ పరమేశ్వరుడు ఆవేశించును. కావుననే ఒక ఋషి కుమారుడగు పరశురాముని స్వామి ఆవేశించి వ్యాపించినాడు. అచ్చట స్వామి విష్ణువు అనబడినాడు. విష్ణువు అనగా వ్యాపించువాడు అని అర్ధము. పరశురాముడు కూడా అవతారములలో నిలచినాడు. కాని అహంకరించి గర్వభంగము పొందినాడు కారణమేమి? పరశురామునిలో శరీరము మాత్రమే కాక అనేక జన్మల సంస్కారముల సమూహమైన విశిష్టమైన ఒక జీవ స్వరూపమున్నది. కావున పరశురామునిలో శరీరము, జీవుడు, దేవుడు అను ముగ్గురున్నారు. దేవుడు చేసిన పనిని జీవుడు తాను చేసితినని అహంకరించినాడు. కావున జీవుడు అద్వైత కైవల్యమును పొందినచో వచ్చు ప్రమాదమిది. కనకపు సింహాసనమున శునకము కూర్చుండ బెట్టిన వెనుకటి గుణమేల మారును? కావున జీవుడు అద్వైత కైవల్యమును కోరవద్దని ఉపదేశించుచు దాస భావములో ఉన్న జీవుడు అద్వైత కైవల్యమున కన్న అధికస్ధితిని సాధించవచ్చునని ఉపదేశించుచూ రామావతారమున దైవశక్తులను దాసుడైన హనుమంతున కిచ్చి తాను ఆ దైవశక్తులను లేకయుండి తన కన్న అధిక స్ధానమున దాసుని నిలిపి చూపెట్టినాడు. పరశురాముడు స్వామి కైవల్యమును కోరి తనను తాను హెచ్చించుకున్నాడు. కనక తగ్గించబడినాడు. హనమమంతుడు దాస భావమున తనను తాను తగ్గించుకున్నాడు. కనుకనే రామాంజనేయ యుద్ధమున రామునినే ఓడించగలిగినాడు. ఇది జీవులకు స్వామి ఇచ్చిన ఉపదేశము. రామావతారమున కౌసల్యా గర్భమున చేతనమైన శరీర పిండము ఏర్పడినది. ఈ శరీర పిండములో అనేక జన్మ సంస్కార వాసనా రూపమైన విశిష్ట జీవుడు లేడు. కేవలము సామాన్య చైతన్యమైన జీవస్వరూపము ఉన్నది. ఈ సామాన్య చైతన్యము సామాన్య జీవస్వరూపమే అనవచ్చునే తప్ప విశిష్ట చైతన్య స్వరూపమనరాదు. ఈ సామాన్య చైతన్య స్వరూపములో కేవలములో చైతన్యము ఎట్టి మలినములు లేని శుద్ద జలము వలెనుండును. దీనిలో జీవుని యొక్క పూర్వకర్మ వాసనా గుణములు ఉండవు. ఈ చైతన్యములో కేవలము వంశ లక్షణములు మాత్రమే ఉండును. ఈ సామాన్య చైతన్యము శుక్రము- రేతస్సు యొక్క సంయూగము చేత ఏర్పడు గర్భస్ధ శిశు పిండములో ఉండును. బ్రహ్మసూత్రములలో శ్రుతి ప్రమాణముగా రేతస్సు ద్వారా జీవుడు పిండము లోనికి ప్రవేశించు చున్నట్లు చెప్పబడుచున్నది. కాని కొందరు యోగి శ్రేష్టులు మూడవ మాసమున గర్భస్ధ శిశు పిండము నందు జీవుడు ప్రవేశించు చున్నాడని చెప్పుచున్నారు. ఈ ప్రవేశించు జీవుడు పూర్వకర్మ వాసనా జీవరాశి యగు విశిష్ట జీవుడు. ఈ విశష్ట జీవుడు పై లోకమములలో పుణ్య పాప కర్మల ఫలములను అనుభవించి కర్మ శేషముతో అనగా కొంచెము ముగిలిన పాపము పుణ్యములతో ఈ లోకమునకు వాయుమండల మేఘమండలముల ద్వారా, వర్షము ద్వారా భూమిలోకి ప్రవేశించి, మొక్క ద్వారా దాని గింజల ద్వారా పురుషుని రేతస్సు ద్వారా స్త్రీ గర్భములోనికి ప్రవేశించుటయో లేక మూడవ మాసమున ఆ ధ్యానపు గింజను భుజించిన గర్భవతి యగు స్త్రీ గర్భము లోనికి ప్రవేశించుటయో జరుగుచున్నది. ఏ మతమైనను మొత్తము మీద విశిష్ట జీవుడు గర్భస్ధ శిశు పిండములోనికి ప్రవేశించుచున్నాడు. అయితే విశిష్ట జీవుడు ప్రవేశించక ముందు ఆ శిశు పిండము అచేతనమైన శరీరముతోను కేవలము వంశ లక్షణములు గల శుద్ద చైతన్యమయమైన సామాన్య జీవునితోను కలసి యున్నది. ఈ సామాన్య జీవ స్వరూపమే విజ్ఞాన శాస్త్రవేత్తలకు అందుచున్నది. విశిష్ట జీవ స్వరూపమను ఏ మానవుడు దర్శించజాలడు. అని గీతలో ఇట్లు చెప్పుచున్నది. "ఉత్‌క్రామంతం స్ధతం వాపి భుంజానంవా గుణాన్వితం విమూఢానాను పశ్చంతి పశ్చంతి జ్ఞాన చక్షుసః". అనగా, దీని అర్ధము ఈ విశిష్ట జీవుడు గర్భములోనికి ప్రవేశించుచున్నప్పుడు గానీ, శరీరము వదలి పోవుచున్నప్పుడు గానీ, కర్మఫల వాసనా గుణ స్వరూపుడైన ఈ జీవుని ఇతర జీవులు యెవ్వరునూ ఎట్టి ప్రయత్నము చేతనూ చూడలేరు. కేవలము యోగీశ్వరుని యొక్క యోగ దృష్టికే కనపడును. కావున విజ్ఞాన శాస్త్రవేతేలు పిండములో చూచుచున్నది వంశ లక్షణములకు సంభందించిన జీన్స్‌ కలల సామాన్య జీవస్వరూపమే. కావున నేటి జీన్స్‌ సిద్ధాంతము ప్రకారము విజ్ఞాన శాస్త్రవేత్తలు మార్చగలిగినది కేవలము వంశానుగతములైన గుణములు మాత్రమే. పూర్వ కర్మ వాసనా గుణ స్వరూపుడైనన జీవుడు కనిపించడు కావున ఆ పూర్వ జన్మ కర్మ వాసనా గుణములు కూడా మానవుల భౌతిక దృష్టికి గోచరించవు. కావున విశిష్ట జీవుని యొక్క గుణములను మానవుడు మార్చుట అసంభవము. ఈ సామాన్య జీవ స్వరూపములో కూడా కేవలము వంశానుగత గుణములు మాత్రమే మానవుడు మార్చగలడే తప్ప ఆ గుణములకు ఆధారమైన శుద్ధ చైతన్యమును సృష్టించలేకున్నారు. అచేతనములగు పదార్ధముల నుండి చైతన్యమును మీరు పుట్టించగలరా? మృత కళేబరములో చైతన్యము తెప్పించగలరా?

ప్రశ్న:- "మేము విశిష్ట జీవుని అంగీకరించము. కనపడని దానిని ఒప్పుకొనము. కావున సామాన్య జీవుని మాత్రమే అంగీకరించెదము".
సమాధానము:- "సరే అట్లే కానిండు. సామాన్య జీవ స్వరూపమైన చైతన్యమును మీరు ఏల సృష్టించలేకున్నారు? cloning అను ప్రక్రియలో చేతనమైన పదార్ధము నుండి చైతన్యమయమైన జీవుని సృష్టంచగలరే తప్ప అదే చేతన పదార్ధములోని మూలకముల యొక్క పరమాణువులన్నింటినీ అనగా కార్బన్‌, హైడ్రోజిన్‌, ఆక్సిజన్‌, నైట్రోజన్‌ మొదలగు మూలకములైన పదార్ధములను మీకు ఇచ్చెదము. వాటి నుండి జీవసృష్టి చేయగలరా? అనగా మీకు జీవ కణములోని మూలకముల పరమాణువులన్నియునూ తెలియును. ఆ పరమాణువులను కలిపి ఈ జీవకణములలో నున్న సమ్మేళనములనన్నింటినీ తయారు చేయగలరు. ఆ సమ్మేళనమే తప్ప జీవకణములో మరియొకటి లేదని మీరు అనుచున్నారు. ఇదే నిజమైనచో ఆ సమ్మేళనముతో మీరు ఏల సృష్టించలేకున్నారు? మీకు టి.వి ఇచ్చినాము. టి.విని విడదీసి దానిలోని భాగముల న్న్నింటినీ మీరు పరిశిలించినారు. పని చేయుచున్న టి.విలో విద్యుత్తు కూడా ఒక భాగమే. మీరు టి.వి భాగములను విడివిడిగా ద్రవ్య పదార్ధముల నుండి తయారు చేయగలుగు చున్నారు. మరియు టి.విని పని చేయించగలరు. విద్యుత్‌ని గూడా నీటి నుండియో, బొగ్గు నుండియో, అణు reactors నుండియో సృష్టించ గలుగుచున్నారు. కావున టి.వి భాగముల నన్నింటినీ విద్యుత్తుతో సహ, సృష్టించి మరల వాటి సమావేశపరచినప్పుడు టి.వి పని చేయుచున్నది. జీవకణములో అన్ని సమ్మేళనములనూ సృష్టించి మీరు సృష్టించిన జీవకణమును పని చేయించగలుగు శక్తియగు చైతన్యమును మీరేల సృష్టించలేకున్నారు? విద్యుత్తు మీకు గోచరించినది గాన మీరు సృష్టించగలిగినారు. ఈ చైతన్యమే జీవుడు అందురు. ఈ జీవుడు ఏ మానవునకునూ గోచరించడు కేవలము యోగీశ్వరుని దృష్టికే గోచరించును అని గీతా శ్లోకము ఇదియే చెప్పుచున్నది.
ప్రశ్న:- మేము జీవ సృష్టిని చేయలేము. అంగీకరింతుము. కాని జీవకణములలో నున్న డి.ఎన్‌.ఎ, అర్‌.ఎన్‌.ఎ అణువులను సృష్టంచి ఒక జీవునిలో దుర్గుణములు లేకుండా చేసి, ఆ జీవుడు కేవలము సత్కర్మలే చేయునట్లు మేము చేయగలము. బుద్ధి యొక్క గుణములను అనుసరించియే కర్మలు చేయుట జరుగును. కావున ఒక మానవుడు జన్మించినపుడు వానిలో నున్న పుణ్యకర్మ శేషము వాని చేత పుణ్యకర్మలను వానిలోని పాపకర్మ శేషములు వానిచేత పాపకర్మలను చేయించును అన్న మీ కర్మ సిద్ధాంతమునకు వ్యతిరేకము చేయగలము. అనగా వానిలో కృత్రిమ జీన్స్‌ ద్వారా దుర్గుణములు తొలగించి అన్నీ సద్గుణములే ఉండునట్లు చేయగలము. అప్పుడు వాడు కేవలము పుణ్యకర్మలనే చేయును. కావున మీ కర్మ సిద్ధాంతమునకు భంగము కలుగును.
సమాధానము:- మీకు కనిపించని చైతన్యము అగు విశిష్ట జీవ స్వరూపము మీరు తయారు చేయలేక పోయినను, ఉన్నది అని మీరు అంగీకరించినారు కదా. మీరు సామాన్య జీవ స్వరూపములో నున్న జీవ స్వరూపమును మార్చగలరే కాని మీరు తయారు చేయలేని, ఉన్నది అని మీరు అంగీకరించక తప్పని, విశిష్ట జీవ స్వరూపములలోని దుర్గుణములు మీరు ఎట్లు మార్చగలరు? ఒకవేళ మీరు సామాన్య జీవునిలో అన్ని సద్గుణములు ప్రవేశింపజేసి ఈ భూలోకమున వాని చేత సత్కర్మలే చేయించినారు అనుకొనుడు. ఇట్లు చేయించుటకు మీరు జీన్స్ ను మార్చనక్కరలేదు. ఒక మానవుని వెంట అహోరాత్రములు పోలీసులు కాపలా ఉంచి వాడు ఎట్టి దుష్కర్మలను కూడా చేయించకుండా ఉండవచ్చును కదా? ఎట్లు అయిననూ, వాని చేత జీవిత కాలమంతయు సత్కర్మలన్నియునూ మా విశిష్ట జీవ స్వరూపమలల సద్గుణముల యొక్క ప్రభావమే. ఇక విశిష్ట జీవ స్వరూపములలో నున్న దుర్గుణముల ప్రభావముల చేత దుష్కర్మలను వాడు ఈ కర్మలోకమగు భూలోకమున చేయలేదు కదా. మరణించిన తర్వాత పై భోగలోకములలో ఫలముల అనుభవముండునే తప్ప కర్మ ఉండదు కదా. మరి విశిష్ట జీవస్వరూపములో పాత కర్మశేషము ఉన్నవన్నారు కదా. అనగా దుర్గుణములున్నవి కదా? కావున దుష్కర్మలను చేయవలెను కదా. దానిని మేము చేయ నీయలేదు. కావున కర్మ సిద్ధాంతము భంగమైనది? మానవజన్మ మిశ్రమ కర్మఫల స్వరూపము. అనగా సద్గుణ దుర్గుణ శేష స్వరూపమైన జీవుడే మానవజన్మను ఎత్తును. కేవల సద్గుణ స్వరూపుడు దేవ జన్మలనెత్తును. కేవల దుర్గుణ శేషస్వరూపుడు రాక్షస జన్మలనెత్తును. విజ్ఞాన శాస్త్రవేత్తల ప్రయోగములు కేవలము మానవుని పైనే జరుగుచున్నవి. దీనికి సమాధనమే కర్మలోకమగు భూలోకము నాలుగు అవాంతర లోకములుగా విజభింపబడి ఉన్నది. క్రింద మొదటి అవాంతర లోకము మర్త్యలోకము. దీని పైనున్న అవాంతర లోకములు వరుసగా ప్రేత, నరక, పితృ లోకములు. మరణించగనే మానవుడు ప్రేతలోకమున కేగుచున్నాడు. ఈ లోకములో మానవుని కర్మల విచారణ జరుగును. పాప కర్మలకు నరకలోకము, మధ్య కర్మలకు పితృలోకము, ఉత్తమ కర్మలకు భూలోకమునకు పైనున్న జ్యోతిర్లోక, స్వర్గలోకములు లభించుచున్నవి. ఇచ్చట కర్మలోకము అనగా భూలోకము యొక్క మొదటి అవాంతర లోకమగు కేవలము మర్త్యలోకమే. ఈ మర్త్యలోకమున మాత్రమే కర్ము చేయవీలగును. మీరు పొరపాటు బడినది ఎచ్చట అనగా మానవుడు మరణించగానే ప్రేత రూపమును ధరించుట సత్యమే కాని పదియవ దినమున "ఇతః పరౌ ప్రేతశబ్ధం నాస్తి" అని అన్నప్పుడు ఆ ప్రేత రూపుడు వెంటనే కర్మలోకమగు మర్త్యలోకమును దాటి ప్రేతలోకమునకు పోనవసరము లేదు. ఆ జీవుడు ప్రేత రూపముతోనే మర్త్యలోకమున అనగా కర్మలోకమున ఉండవచ్చును. కావున ఈ కర్మలోకముననే ప్రేతస్వరూపుడైన పిశాచ రూపము వానిలోనున్న దుర్గుణముల ప్రేరణ చేత దుష్కర్మములనే చేయును. కావున జీవుడు మిశ్రమ గుణస్వరూపుడై సత్కర్మములనూ దుష్కర్మములనూ ఈ లోకముననే చేసి భోగలోకములకు పోవును. కావున మీ జీన్స్‌ సిద్ధాంతము మానవుడు బ్రతికి ఉన్నంత వరకే తప్ప మానవ దేహము దహనమయిన తరువాత పిశాచ రూపమున పనిచేయదు. పిశాచములు ఉన్నట్లు ప్రామాణ్యము అనేక దేశములలో నిరూపితమగుచున్నది గదా! కావున విజ్ఞాన శాస్త్రవేత్తలు దైవశాసన నియమితమైన కర్మ సిద్ధాంతమును భంగము చేయజాలరు. ఇప్పుడు అసలు ప్రకరణములోకి వచ్చెదము గాక. అవతరించిన రామునిలో అచేతనమైన శరీరము ఉన్నది. పూర్వకర్మ వాసనములు అను మలినములు లేని శుద్ద జల సమానమైన శుద్ద చైతన్య స్వరూపమైన గర్భస్ధ శిశు పిండ ఆవిర్భావ సమయముననే ఏర్పడిన సామాన్య జీవ స్వరూపము ఉన్నది. ఇట్లు శరీరమను ప్రకృతియు సామాన్య జీవుడను పురుషుడునూ ఉన్నారు. ఈ రెండింటిలోనికి పురుషోత్తముడైన పరమాత్మ ప్రవేశించి, వ్యాపించి ఉన్నారు. ఇట్లు ప్రకృతి, జీవ, ఈశ్వర తత్త్వములు మూడునూ ఉన్నవి. ఇచ్చట పూర్వకర్మ వాననా స్వరూపమైన విశిష్ట జీవుడు లేడు. కొందరి మతమున గుణరహితమైన ఈ శుద్ద చైతన్యము ప్రకృతి లోనికే చేతన అనుపేరున చేరుతున్నది. దీనిని పరాప్రకృతి అనుచున్నారు. "సంఘాతః చేతనా ధృతిః" అను గీతా శ్లోకము ప్రకారముగా చేతన ప్రకృతి రూపములలోనే చేరుచున్నది. అప్పుడు శరీరమూ, చేతనయూ కలసి ప్రకృతి అనబడుచున్నది. అప్పుడు పురుషోత్తముడగు పరమాత్మయే పురుషుడనబడుచున్నాడు. ఈ మతము ప్రకారముగా రామావతారము ప్రకృతి, పురుష మిళితమై రెండు తత్త్వములతోనే ఉన్నది. ఇక రామావతారము కన్నా భిన్నమైన ఒక మానవుని గూర్చి విచారించెదము. గర్భస్ధ శిశు పిండములో అచేతనమైన శరీరమున్నది. సామాన్య జీవుడనబడు చేతనయూ ఉన్నది. పూర్వకర్మ వాసనా గుణ స్వరూపుడగు విశిష్ట జీవుడూ ఉన్నాడు. సామాన్య జీవుని విశిష్ట జీవునితో చేర్చి, జీవుడన్నచో శరీరమను ప్రకృతి జీవుడనబడు పురుషుడూ ఉన్నారు. సామాన్య జీవుని చేతనయను పేరుతో ప్రకృతిలోకి చేర్చినను ప్రకృతి పురుషులే ఉన్నారు. కావున సరిగా విచారణ చేయలేని వారు సామాన్య మానవునులోను రామావతారములోను ప్రకృతి పురుషులిరువురే ఉన్నారని భావించుచున్నారు. కానీ విచారణ చేసినచో రామావతారములో ఉన్న తత్త్వములు ప్రకృతి పురుషులను రెండే అయినప్పటికిన్ని ఆ రెండింటి యొక్క స్వరూపములు వేరుగా ఉన్నవి. రామావతారములో ఉన్నవి ఒకటి శరీరము, రెండు శుద్ద చైతన్యమైన సామాన్య జీవుడు, మూడు పరమాత్మ. సామాన్య మానవునిలో ఉన్నవి.

ఒకటి శరీరము, రెండు శుద్ద చైతన్యమైన సామాన్య జీవుడు, మూడు కర్మశేషగుణమైన విశష్ట జీవుడు. మరల అక్కడా మూడే ఇక్కడా మూడే కనుక సమానమనరాదు. కాని అక్కడున్న మూడు వేరు. ఇక్కడున్న మూడు వేరు. కాకపోయినచో ఒకటి శరీరము .రెండు శుద్ద చైతన్యమైన సామాన్య జీవుడు ఇరువురిలో సమానముగా ఉన్నారు. కాని సామాన్య మానవునిలో కర్మశేష స్వరూపుడైన జీవుడు ఉన్నాడు. రామునిలో ఆ విశిష్ట జీవునికి బదులు పరమాత్మ ఉన్నాడు. కావున ప్రకృతి , పురుష, పురుషోత్తమ శబ్ధముల యొక్క అర్ధములను సంకలీకృతము చేసి జీవునిలోను ఈశ్వరునిలోను అభేదములు శబ్ధార్ధముల నృత్యము చేత ఊహాత్మకముగా సాగించి అద్వైత పండితులు జీవుడే దేవుడనుచున్నారు. శంకర భాష్యమును అపార్ధము చేసినారు. శంకరులు చెప్పిన అద్వైతము కేవలము అవతార పురషుని విషయములోనే. భాష్యమును అపార్ధము చేసుకొని "నేను దేవుడనే" అని భావించుచున్న శిష్యులను మరల భాష్యము చెప్పి దిద్ద దలచుకొనలేదు. ఏలననగా మరల రెండవ భా్య్యమును అపార్ధము చేసుకొనుదురు. కావున అపార్ధము రాకుండా ఉండుటకు ఒక క్రియ ద్వారా బోధను చేసినాడు. ప్రతి జీవుడూ బ్రహ్మమే కావున తాము బ్రహ్మమే అని భావించుచున్న శిష్యులను కరిగిన సీసమును తాను త్రాగి వారునూ బ్రహ్మమే కావున వారిని కూడా త్రాగమన్నాడు. ఇది భాష్యము కాదు. ఆచరణము. కావున దీనిని ఇంక వక్రీకరణము చేయు అవకాశము లేనందున శిష్యులు సత్యమును తెలుసుకుని దేవుడు జీవుడుగా అవతరించునే తప్ప జీవుడు దేవుడు కాడని తెలుసుకుని దేవుడే జీవుడైన శంకరులకు దాసోహం అని పాదములపై పడినారు. కాని తరువాత అద్వైత మత పండితులు ఈ సన్నివేశమును ఎప్పుడును స్మరించరు. ఏలననగా అది వక్రార్ధమును చేయుటకు వీలుకానిది. అందరాని దానిని అందినట్లు ఊహించికుని సంతసించుట మానవునికి ఉన్న ఒక బలహీనత. కావున "సోహం" అను మార్గములో అద్వైత కైవల్యమును కోరి శంకరుల శిష్యుల వలె పరాభవము పొందనేల? ఇట్టి అద్వైత కైవల్యమునే కోరి, పొంది నిలుపుకొనలేక పరాభవమును పొందినవాడు పరశురాముడు. పరశురాముడు ఒక సామాన్య మానవుడు. ఆయనలో శరీరము, రెండు శుద్ద చైతన్యమైన సామాన్య జీవుడు, మూడు పూర్వకర్మ వాసనా ఫలమైన విశిష్ట జీవుడు. ఈ ఋషి కుమారుని లోనికి పరమాత్మ ప్రవేశించి వ్యాపించినాడు. ఇప్పుడు పరశురాముడిలో పై మూడింటితో పాటు నాల్గవ వాడగు పరమాత్మ ఉన్నాడు.

ఆ పరమాత్మయే సకల క్షత్రియ సంహారము చేసినాడు. కార్తవీర్యుని వధించినాడు. కాని విశిష్ట జీవునిలో పూర్వ వాసనా గుణములు ఉన్నవి కావున ఆ విశిష్ట జీవుని గుణమగు అహంకారము వెలిగినది. ఈ మహిమనంతయు తానే చేసితినని అహంకరించినాడు. దీనితో రాముని చేత పరాభవించబడినాడి సత్యమును తెలుసుకుని తానింకనూ సాధన చేయవలెనని గ్రహించి తపస్సు చేయ నారంభించినాడు. ఇట్లు రామావతారము మానవునకు అద్వైత కైవల్యము వలదని బోధించి శరణాగతి ప్రపత్తి మార్గములో హనుమంతునకు సృష్టి స్ధితి లయాధికార పదవిని ఇచ్చి నిజమైన పరబ్రహ్మముగా చేసినాడు. కాని రామావతారమున ఎట్టి సిద్ధులు ప్రదర్శించబడక సామాన్య మానవునితో సమానమైన స్ధితిలోనే ఉండెను. అప్పటి మానవుడు తనతో సమానుని అంగీకరించినారే తప్ప సాటి మానవ రూపమును తనకన్నా అధికముగా భావించు స్ధితికి రాలేదు. కావున సిద్దులు ప్రదర్శించి రాముడు మానవత్వమును మించిన దైవత్వమును చూపించలేదు. సిద్ధులను దైవత్వమును ఒక వానరమగు హనమమంతుని ద్వారా ప్రదర్శింపజేసినాడు. అది సాటి మానవుడు కానందున, కోతి అయినందున అంగీకరించిరి. క్రమముగా మానవుని అసూయ మరియొక కిలో తగ్గినది. సాటి మానవుని ఆధిక్యతను అంగీకరించు స్ధితికి మానవుడు వచ్చినాడు. అప్పుడు సాటి మానవునిగా కృష్ణావతారమున సిద్ధులను ప్రదర్శించి ఆధిక్యమును చూపించినాడు. కృష్ణావతారము తరువాత కలియుగారంభమున సిద్ధులే దైవత్వమని మానవుడు మరల భ్రమించినాడు. ఈ భ్రమను నివారించుటకు జ్ఞానము, కరుణ, శాంతి మొదలగు కల్యాణ గుణములే దైవత్వమని సిద్ధులు కేవలము భగవంతుని ఆభరణములేనని వాటిని పరమాత్మ నుండి పొంది రాక్షసాదులు కూడా ప్రదర్శింపగలరని బోధించుటకే, ఎట్టి మహిమలు చేయని కరుణా, శాంతి,జ్ఞానము త్యాగము మొదలగు కల్యాణ గుణములు గల బుద్ధావతారము వచ్చినది. ఈ విధముగా జ్ఞానానంద శాంతి కరుణాది గుణములు గల నరాకారమునే స్వామి నిరంతరము ఆవేశించి ఉండునని బోధించి జ్ఞాన బోధలు సమాప్తి చేసినారు. ఇంత బోధ చేసిననూ అసూయ, అహంకార, స్వార్ధములతో మారని జీవులను కల్కి అవతారములో ఖండించి వారిని శాశ్వతముగా పశుపక్ష్యాది జన్మలకు త్రోసి వేయుదురు. కావున విష్ణువు మత్స్యావతారమున చేపగా వచ్చినప్పుడు ప్రతి చేపయూ విష్ణువు కాదు. ప్రతి చేపయూ విష్ణువైనచో సాక్షాత్తు పరమహంసయే చేపను ఎట్లి భుజించెను? ప్రతి మానవుడు దేవుడే అయినచో గోపికలు పతి పుత్రాదులను త్యజించి బృందావనమునకేల వెళ్ళిరి? మీరా భర్త నేల వదిలెను? బుద్ధుడు భార్యా పుత్రులనేల త్యజించెను? పరమాత్మ కొరకు శంకరులు తల్లి నేల వదిలెను? ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని ఏల ధిక్కరించెను? కావున అసూయా తత్త్వము పూర్తిగా అంతమొందిచు కున్న జీవుడు అనసూయ అగును. ఇందు స్త్రీ పురుష భేదము లేదు. అందరు జీవులునూ ప్రకృతి రూపులే. శరీరము అపరాప్రకృతి. జీవుడు పరాప్రకృతి. కావున సర్వ జీవులునూ స్త్రీలే. పురుష సూక్తము ప్రకారముగా స్వామి ఒక్కడే పురుషుడు. కావున ప్రతి జీవుడూ అసూయను పరిపూర్ణముగా తుడిచి చేసినచో అనసూయగా మారవచ్చును. అనసూయా గర్భముననే దత్తుడు ప్రవేశించెను. అనగా నీలో దత్తుడులీనమై తనను తాను దానము అనగా దత్తత చేసికొనును. అప్పుడు నీవు దత్త స్వరూపుడవై సాక్షాత్తు దత్తావతారము అగుదువు.

AT the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

No comments:

Post a Comment