Friday, July 10, 2009

గురుపూర్ణిమ దివ్య ప్రచచనము: కర్మఫలత్యాగము-3

దానములో తొందర పనికిరాదు. సద్గురువు లభించువరకు ఓర్పుతో నీ ధనమును కూడబెట్టుకొనుచూ లభించగానే మొత్తమును గురుదక్షిణగా ఇమ్ము. ఆరోజే నిజమైన గురుపూర్ణిమ. ప్రతిరాత్రి ఒక్కొక్క కళతో చంద్రబింబము ఈనాటికి పూర్తి అగునట్లు నీవు కూడబెట్టిన ధనముతో నీ హుండి పూర్తి కావలయును. దానములో దేశము, కాలము, పాత్ర అను మూడు అంగములు ఉండును. పాత్ర చాలా ముఖ్యము. గురుపూర్ణిమ (కాలము) రోజు, కాశి (దేశము)లో దానము చేయుట ముఖ్యము కాదు. యోగ్యునకు (పాత్ర) దానము చేయుట ముఖ్యము. ఆ పాత్ర సద్గురువు అవునా? కాదా? అని నీవు విచారించుట లేదు. సద్గురువగు గురుదత్తుడు లభించినప్పుడు నీవు కూడబెట్టిన ధనమును గురుదక్షిణగా అర్పించిన ప్రదేశమే కాశి. ఆ రోజే నిజమైన గురుపూర్ణిమ.

సద్గురువు లభించనిచో దీనుడైన దత్తభక్తునకు దానము చేయము. నారద భక్తి సూత్రము ‘‘తన్మయాహితే’’ ప్రకారముగా స్వామి అవతార పురుషునిలోనే కాక భక్తులలోను ఉన్నాడు. అయితే భక్తులలోను ఉన్నాడు. అయితే భక్తులలో స్వామి బోధించినది ఆ జీవుడు బోధించి ఆచరిస్తాడు. అప్పుడు దోషములు రావచ్చును. ఉదాహరణకు నీవు ఒక భక్త సమాజమునకు గురుదక్షిణ ఇచ్చితివి. దానితో వారు శివరాత్రినాడు కాశీలో వంద మందికి అన్న దానమును చేస్తారు. అయితే సద్గురువు, పాత్రడైన ఒకనికి వంద రోజులు అన్న దానమును చేసి నీ గురుదక్షిణను పూర్ణ
ఫలమిచ్చును. సద్గురువు విషయములో శరీరములో స్వామి ఒక్కరే ఉంటారు. కావున ఆయన బోధలో కాని, పనిలో కాని ఏ దోషము రాదు. షిరిడీసాయి వచ్చిన గురుదక్షిణలను బీద భక్తులకు ఇచ్చేవారు. సర్వజ్ఞుడగు ఆయనను ఎవరు మోసగించలేరు. బిచ్చగాళ్ళు నిన్ను మోసగించగలరు.

No comments:

Post a Comment