Tuesday, May 3, 2011

ANSWERS FOR THE CONTROVERSIES IN THE DEATH OF BODY OF SATYA SAI BABA

[April 30, 2011] There are a few controversies, which appeared recently regarding the death of the body of Baba.
1) The controversy is that Baba told that He will live up to 96 years, but the death is preponed by about ten years.
An astrologer told that Baba lived up to 96 years according to the theory of the cycle of 27 stars. So much strain is not necessary in this issue. God has full freedom to postpone or prepone the lifetime of any human being including the human incarnation. It is not like the one hour bell for a teacher in the classroom. The case of the divine preacher is different. Generally, we find the teacher spending leisurely the rest of the period if the topic is over since he cannot quit the class before time. He is bound by the rules of the institution. But, if the principal enters and speaks for sometime, there is no binding on the time. Whenever the principal finishes his speech, he can quit at anytime and the concerned teacher follows the rest of the period. The human incarnation is the head of the creation. In fact, the life period of any human being can be preponed or postponed by God. If the human being is found to be useful, its life is extended. If the human being is found useless, its life is shortened and is thrown into the lives of birds and animals, which live only to eat and sleep. The extension and shortening of life period is mentioned in the ethical scripture also. It says that if you sleep after sunrise, your life is shortened. It also says that your life is extended if you serve the elders. Therefore, the life period is not a fixed item. Baba might have preponed the exit since He found that the humanity will not change really and might have been vexed with the changeless behavior of the human beings.

2) Another issue is that why He saluted the devotees with folded hands on the last occasion.
You can find a similar situation in the case of Jesus also. Jesus washed the feet of His disciples on the last occasion of His departure. Jesus explained the reason of His such act. Jesus wanted that the disciples should never become egoistic and should treat their disciples with respect always. The devotees are human beings and their devotees are also human beings. One human being should respect the other human being. The case of Baba is different. Baba is God and the devotees are human beings. Baba need not respect His devotees. But, later on, some of His disciples may have again disciples and they may imitate Baba thinking themselves also as human incarnations. All these points stand as the basis for such acts of Jesus and Baba. Baba is giving the message that you should express gratefulness to anybody irrespective of the status. Baba is also giving the message that you should remain as devotee only with folded hands before God. You should never claim that you are the human incarnation with a blessing hand always, falling in the trap of the praise of your disciples.

3) Another issue is that Baba told that He will rise after three days from death of His body.
Even in the case of Jesus, such a statement was made and this shows the similarity between Baba and Jesus. Shirdi Sai Baba also rose after three days after death. This miracle is not necessary in the case of Baba, who arose a dead person, which shows that Baba is the controller of the life. When Baba can rise other dead persons, can’t He rise Himself? Both the miracles establish the same concept. The point is that whether Baba can do it or not. If it is established by one type of miracle that Baba can do it, another type of miracle establishing the same concept need not be done again. For a wise person, one miracle, which is an unimaginable event, is sufficient to understand that the unimaginable God exists in that body. Rama has not done any miracle except one i.e., converting the stone into a woman by the touch of His foot. Is this one miracle not sufficient to establish that Rama is God? All the sages understood Rama as God because they are learned scholars. Rama performed this miracle in presence of the sage Vishwamitra and Vishwamitra propagated this miracle to other sages. Krishna performed many miracles. But there were many enemies for Krishna. Kauravas saw the top-most miracle, which was the cosmic vision, but still did not believe Krishna as God thinking that it is illusion of eye. For a human being, with the faculty of intelligence working, demonstration of one unimaginable event is sufficient. For human beings, burning with ego and jealousy, even if thousand miracles are demonstrated, all will be treated as magic or illusion of the eye.

4) Some people say that Baba was harmed by some of His followers.
Is this possible? Can a human being harm God? Assuming that somebody harmed Baba, it must be the will of Baba only. Jesus was crucified by some people and it was done by the will of God only. If there is any sin in the followers, God will take care of it by giving punishment in the appropriate time. Why should you worry about it? You follow all the messages of Baba and try to practice so that God will be pleased with you and you will be protected by the grace of Baba. You are wasting your valuable time and energy in unnecessary things neglecting the essential aspects related to your future welfare. Jesus, while carrying on the cross told the weeping people that they should weep about themselves and their children. The reason is that after the momentary pain of crucifixion, Jesus will sit on the lap of God whereas the people will go to the permanent hell after this short happy life. You try to stand on the principles preached by Baba and you neither worry about Baba nor about others. Whether others follow or not, you follow the principles preached by Baba. Everybody thinks that he or she need not follow these principles since others are not following. The entire society thinks like that only. The king asked for the donation of one tumbler of milk from each house. Everybody thought that one can pour one tumbler of water, which will be mixed in the milk poured by others. Finally, the whole drum was full of water only! Everybody should follow the principles preached by Baba not caring for others [following]. If you are interested in their welfare, you preach them also after personal follow-up. If there is no change, even the entire mass will be punished, which is going to be the future action of Kalki. Don’t think that since it is an issue of the mass, there will be excuse.

At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

Thursday, April 21, 2011

Message on Shri Satya Sai baba: NEITHER SOUL NOR GOD SUFFERS WHEN BODY SUFFERS IN INCARNATION

O Learned and Devoted Servants of God,
[Posted from Discourse of H H Shri Dattaswami] A pseudo-scientist will present irrelevant arguments like the inability of Shri Satya Sai Baba to cure His own health, who performed several miracles and cured the illness of several devotees. By this, he wants to establish that all the miracles performed by Baba were not genuine. He wants us to realize the truth about His miracles. Actually, he should realize the truth in the silence of Baba to cure His illness. Baba wants us to understand that the soul is totally different from body and is not connected with the issues and bonds of the body. The soul is energy and is eternal with respect to the body. In the body of Baba, both soul and God are present. God is absolutely eternal and is also totally disconnected with soul and body. In the Gita, Krishna says that He is the third entity other than body and soul (Yesmaat ksharamateetoham…). We are unable to differentiate even soul and body and not to speak of differentiating God from soul and body. Whether you take Baba as God or soul, the points related to the body are disconnected to Him. The body is the shirt of the soul and the soul is the underneath banian for God. The shirt is disconnected from the banian and the banian is disconnected from the human being. Here, the human being is the comparison for God. A human being consists of two items only:
1) The external body, shirt and
2) The internal soul, banian
The human incarnation consist of three components:
1) The external shirt, the body,
2) The internal soul, banian and
3) Innermost God, the human being
In this comparison, the soul is inert energy. Even if you take the soul as a specific work form of energy, it is inert only. Inert means the item that is controlled and the Veda says that the soul is controlled by God (Atmeshwaram). Hence, the body and soul are compared to the two inert items, shirt and banian. Infact, the awareness of God alone is eternal, which is generated by His unimaginable power and hence, God is compared to the non-inert living human being here. The body and soul are two different phases of the same component, which are inert matter and inert energy respectively. By understanding that God is disconnected to matter and energy, we should understand that the energy is disconnected to matter. Hence, the soul is not touched by the problems of the body. The Gita differentiates the soul and body in the beginning so that you will slowly differentiate God from body and soul. Even in the human incarnation, the soul is disconnected from the problems of the body as in the case of a realized human being. Since we identify the soul as body and God as the human being, which is understood as both soul and body, we misunderstand the concept. We think that the soul suffers when the body suffers. We think that God suffers when the body suffers and we assume that the soul is also suffering since our souls suffer identifying themselves with our bodies. Neither the soul nor God suffers while the body suffers in the case of human incarnation. Due to lack of this realization, we mistake Baba as His body and soul and therefore, we think that He is suffering. If the shirt is cut by a blade, the underline banian is not cut and not to speak of the innermost human being. If we understand this, we will realize that Jesus did not suffer on the cross and Krishna did not suffer while the bleeding continued on His foot.

We have superimposed the body and the soul with God and talk that Baba is unable to do anything for Himself. The soldiers also mocked at Jesus that He was unable to do anything for Himself on the cross. Even the devotees feel much and their feeling is also based on the ignorance of the realization. But, in the case of devotees, at least their feeling has a positive side, which is their love to Baba. This positive side will be appreciated by God. But, the atheists are not only ignorant but also lack the positive side. Therefore, the message of Baba is that we should identify ourselves with the soul and not with the body. We must maintain this realization even at the time of the death (sthitvasyaamantakaalepi… Gita). The Gita says that the death is a happy occasion, in which the soul leaves the damaged dress and takes up a new dress. The damaged dress is the old body and the new dress is the energetic body, which is entered by the soul. Ignorance is the source of reverse behavior. The atheists always have half knowledge of science but pose as if they have realized the essence of science. The essence of any branch of knowledge is the philosophy. Hence, we find the word philosophy in the highest degree awarded even in science i.e., a doctor of philosophy. Philosophy is only the deep-most analysis of the subject and therefore, there is no opposition between science and philosophy.

At the lotus feet of Shri Dattaswami
Prasad

Wednesday, April 6, 2011

Knowledge-Fire only Burns all sins

O Learned and Devoted Servants of God,

[April 04, 2011 Ugadi] Generally, people greet others wishing the happy festival or wishing the happy birthday etc. We must analyze every word and action of us to find out the truth. The first question you have to put to yourself is “Are you, just a general soul, competent of wishing something good or bad for other souls?” You cannot wish anything good or bad even for yourself. Therefore, there is no use of cursing or wishing good for others. The good or bad in your case or in the case of others happens according to the results of the previous deeds. Your wish cannot change the established mechanism of the divine system of deeds and fruits. Only God is competent to change this divine system. Some people are aware of this fact and therefore, greet “May God bless you”. This statement is also wrong on analysis. Are you dictating God or instructing God to bless somebody or even yourself?

In fact, God never harms or blesses anyone as per the Gita (Naadatte kasyachit…). God has created the divine system of deeds and fruits and the system acts in mechanical way under the instruction of God only. The rule maker will never break the rule. In fact, God subjected Himself to the rule to show that the rule is absolute and inevitable (Evam pravartitam... Gita). The result of killing Vali by hiding Himself behind a tree was enjoyed by the Lord in the next birth. Even if you say that you pray God to help somebody, it is also wrong. Does this mean that you request God to help some undeserving human being? That means, you try to influence God to do a wrong thing. If the human being is deserving, God will help him even without your wish. If you are aware of this fact, you need not wish. The last possibility of your wish is that some soul is deserving and God is either ignorant or cruel in not helping it and therefore, you make God aware of the forgotten point or you are softening the cruel heart of God. Both these options are totally wrong because God is never ignorant and is never cruel. Therefore, the meaning of your statement becomes zero. If you state something, which does not mean anything, you must be mad.

If you are interested in the welfare of somebody, the only way is to state “Please pray God on this occasion so that He will change your mind through divine knowledge and get rid of you from all the results of sins or all deeds.” By such statement, you do not expect the violation of the divine system in any way. The reason for all sins is absence of divine knowledge or the firm realization of it to implement it in practice. If you realize your sins and do not repeat them, all your past and present sins get cancelled. Mere knowing of divine knowledge is not sufficient to give this wonderful result. After knowing, you should memorize it again and again so that you will implement it in practice. Such state of knowledge is called as ‘Realization’. Only realization can cancel the sins. Realization is the knowledge with deep intensity and is called as knowledge-fire. The Gita says that the knowledge-fire can burn all the previous deeds. The Bible also says that Jesus will come to sprinkle fire on the people in the place of water. Here, water means the process of mere knowledge. Fire means the intensified knowledge so that practical implementation of it takes place.

Knowledge can be given by any preacher. But, God in human form like Krishna or Jesus can alone give the knowledge-fire. Therefore, a better statement will be “Please find out the contemporary human incarnation and get divine knowledge from Him. You memorize such divine knowledge so that it becomes knowledge-fire and burn all your sins so that you will be happy in this world, or let it burn all your deeds so that you will get salvation.” In fact, the Gita says that the knowledge-fire should burn all the deeds, which are good and bad. Such stage indicates the absence of any selfish ambition for happiness. All the actions of the soul in such state are meant for God only and there is no selfishness. Such state gives salvation not only in this world, but also in the upper world. The burning of sins only gives happiness in this world only.
At the lotus feet of Shri Dattaswami
-Prasad

Friday, November 12, 2010

కష్టములు – సుఖములు – యోగము

లోకములో కష్టములకు కుంగరాదు. సుఖములకు పొంగరాదు. సుఖములు పైకి లేచిన తరంగాలు కష్టములు క్రిందకు వచ్చిన తరంగములు. తరంగముల యొక్క బరువును తీసుకున్నపుడు ప్రతి తరంగమునకు శృంగము, ద్రోణి రెండు వుండును. శృంగమే సుఖము. ద్రోణియే కష్టము. ఒకదాని వెనుక రెండవది ఉండును. కాలచక్రము తిరుగుచుండగా చక్రములోని క్రింది అరలు పైకి, పై అరలు క్రిందికి వచ్చుచుండును. కావున కష్టము గానీ, సుఖము గానీ నిత్యము ఉండదు. అవి ఎండ నీడల వంటివి. నిరంతరము ఎండలో ఉండలేము. ఎండలో కష్టపడి పనిచేసి నేడకు వచ్చిన వాడు ఎంతో సుఖమును పొందును. అలానే కష్టములను అనుభవించిన తరువాత సుఖమును అనుభవించినచో, ఆ సుఖము ఎంతో రుచిగా యుండును. ఈ కష్టసుఝములు మనస్సులోకి ప్రవేశించరాదు. నీటి అలలో పడవ ఊగుచున్ననూ, ఆ పడవలో ఊయలలో ఊగు వినోదము పొందుచూ ప్రయాణించ వచ్చును. కానీ పడవకు చిల్లిపడి ఆనీరు పడవ లోనికి వచ్చినచో పడవ మునిగిపోవును. అట్లే కష్ట సుఖములు మనస్సులోనికి ప్రవేశించరాదు. కష్టములు వచ్చినపుడు కఠినముగను, సుఖములు వచ్చినపుడు సున్నితముగను ఉండవలెను. "వజ్రాదపి కఠోరణి మృదూని కుసుమాదపి లోకోత్తరాణాం చేతాంసి కోహిని జ్ఞాతు మర్హతి" అని భవభూతి వర్ణించినాడు. "నప్రహృ ష్వేత్‌ ప్రియం ప్రాస్యా నోద్విజేత్‌ పాప్య్రాచా అప్రియం" కష్ట సుఖములకు కుంగక, పొంగక ఉన్నవాడే స్ధిత ప్రజ్ఞుడు అని గీత చెప్పుచున్నది. పొంగుట, కుంగుట వలన మన నుండి శక్తి విపరీతముగా ఖర్చు అగుచున్నది. శక్తి ప్రవర్ధమైన వాడు ఇహము నందును ఏమియూ సాధించలేడు. మరియు శక్తిహీనుడు సాధన చేయలేక పరమును కూడ కోల్పోవును. అట్టివాడు ఇహపరములందు చెడి ఉభయ భ్రష్టుత్వము చెందును. సీతాపహరణము జరిగిన తరువాత రాముడు దారుణముగా విలపించు చున్నాడు. ఆదిశేషుని అవతారము కావున లక్ష్మణుడు రామునితో "అన్నయ్యా! ముందు ఏడ్చుట మానుకొనుము. ఏడ్చినందు వలన సీత కనపడదు. మరియు ఏడుపు వలనన శక్తి నశించి, సీతను వెదుకుటకు కావలసిన శక్తి లేకపోవుట వలన సీత ఎన్నటికినీ లభించదు. యోగము అను శబ్ధము "యుజ్‌" అను ధాతువు నుండి వచ్చినది. "యుజ్‌" ఏకీకరణ అని అర్ధము. అనగా అన్నింటిని కలుపుట అని యోగ శబ్ధమునకు అర్ధము. ఒక నీటి గొట్టము ఉన్నది. దానికి చిల్లులు పడి నీరు ధారలుగా బయిటకు కారుపోవుచున్నవి. అట్లే మన శక్తి అనేక లౌకిక చింతల ఉద్రేకములలో వ్యర్ధముగా బయిటకు చిందిపోవు నీటిధారలను అన్నింటినీ కలిపి గొట్టములో ఒకధారగా ప్రవహింపచేయుట ఉపయోగము. కావున లౌకికములకు చిన్నాభిన్నము చెంది పోవుచున్న ఈ శక్తిధారలను కలిపి ఒకేధారగా చేయుట యోగము.

యుద్ధములో భేరులు మ్రోగుచూ, శంఖములు మ్రోగుచుండ, అందరనను ఎంతో ఉద్రేకముతో నుండగా శ్రీ కృష్ణుడు శాంతసముద్రునిగా మందహాముతో రధమును నడుపుచున్నాడు. ఆయన జీవితములో ఎప్పుడునూ ఉద్రేకము చెందలేదు. కావుననే ఆయనలో శక్తి అంతయు ఆశీభూతమై లీనమై యున్నది. ఆయన విశ్వరూపమును ప్రదర్శించినపుడు బయిటకు వచ్చిన వేల సూర్యుల కాంతి ఆశక్తియే. అయితే ఈ సృష్టిలో ఈ ఉద్రేకము అను దానిని ఏల సృష్టించినాడు? ఆయన సృష్టిలో ప్రతి వస్తువు మంగళకరమే! కావున ఉద్రేకము కూడా ఒక మంచి పనికే సృష్టించబడి యున్నది. ఆ మంచి పనని ఏమనగా భగవంతుని విషయములో ఉద్రేకము చెందవలయును అని భావము. భగవంతుని కొరకు తపించి ఉద్రేకము పొందుటయే తపస్సు. ఇట్లు భగవంతుని విషయములో సద్వినియోగము చేసినచో ఈ సృష్టిలో చెడు అనేది లేదు. చెడు గుణములు కూడ భగవంతుని వైపునకు త్రిప్పినచో అగ్గిలో పడిన పిచ్చిముళ్ళ కట్టెలు కూడ, నుదుట ధరించు పవిత్రభస్మముగా మారునట్లు, ఆ గుణములు పవిత్రమే అగుచున్నవి. గోపికలు తమలో ఉన్న కామము అను గుణము పరమాత్మ వైపుకు త్రిప్పినారు. ఆ కామమే మోక్షమార్గమై వారిని గోలోకమునకు చేర్చినది. భగవంతుని పరముచేయక భగవంతుని వ్యతిరేకముగా జీవుల పరము చేసినపుడు సర్గుణములు కూడా బురదలో పడిన పంచదార వలె వ్యర్ధము అగుచున్నవి. ఎవరి ఉప్పు తిన్నామో వారికి కృతజ్ఞతగా వుండుట సద్గుణము. భీష్ముడు ఈ సద్గుణమును కౌరవుల పరము చేసినాడు. కౌరవుల ఉప్పు తిన్నందున వారివైపు యుద్ధము చేయుట ధర్మమని, ఆ సద్గుణమును జీవుల పరము చేసి పరమాత్మపై బాణములను విసరినాడు. దాని ఫలమే అంపశయ్య పైబడి జీవన మరణమగు మరణ వేదన పడినాడు. ఈ లోకముననే ప్రత్యక్ష నరకమును అనుభవించినాడు. కావున భగవంతుని వియోగము దుఃఖములో ఉద్రేకము చెందినపుడు అచ్చట శక్తి ఖర్చు అగుట సార్ధకమే కాని వ్యర్ధము కాదు. రుక్మిణి కృష్ణుని కొరకు ఎంతో తపనపడి, పెండ్లి రోజు క్షణక్షణము ఉద్రేకమును చెందినది. అదియే మహా తపస్సుగా మారి, కృష్ణుడు ధర్మమును సైతము అతిక్రమించి రుక్మిణిని వివాహమాడెను. రుక్మిణిని శిశుపాలునికి ఇచ్చుటకు నిశ్చయ తాంబూలములు ఇచ్చుకొనుటయు జరిగినది. మను శ్రుతి యొక్క వాచాదత్త అను శ్లోకము ఆధారముగా నిశ్చయ తాంబూలము జరిగిన కన్యకు పెండ్లి అయినట్లే. బ్రాహ్మణుడు రుక్మిణి వ్రాసిన ప్రణయ పత్రము తెచ్చిన తరువాత, కృష్ణుడు కొంతసేపు తర్జన భర్జన పడినాడు. కానీ ఆమె క్షణ క్షణము పడిన ఉద్రేకము చూచి ధర్మమును సైతము అతిక్రమించి కుండిన నగరమునకు వెడలినాడు. కావున లోక చింతలలో ఉద్రేకము విడనాడవలెనే తప్ప, భగవంతుని విషయములో కాదు. పిల్లపెండ్లికి ధనము దాచమని చెప్పినామే తప్ప, పెండ్లినాడు కూడ ధనమును తీయని ఎడల ఆ ధనము దొంగల పాలో, రాజు పాలో అగును. కావున భగవంతుని విషయములో కూడ ఉద్రేకము పొందక శాంతిగా ఉన్నచో వాడు దాచిన శక్తి మృత్యువు పాలగును. మరణానంతరము శరీరము పంచభూతముల పాలగుచున్నది. వాని శరీరములో దాచబడిన శక్తి అంతయు అగ్నిపాలగును. కావున యోగము అనగా లోకమునకు సంబంధించిన ఉద్రేకములలో శక్తిని ఖర్చుకానీయక దాచి, భగవద్భక్తిలో ఖర్చు చేయుట అనగా శక్తి దుర్వినియోగము అరికట్టి సద్వినియోగము చేయుటయే యోగము.

At the lotus feet of Shri Datta swami
-Durgaprasad

Saturday, October 9, 2010

కల్యాణ గుణములు – స్వామి

సౌందర్యము అనునది ఒక కల్యాణ గుణము. సౌందర్యము యొక్క ముఖ్యమైన స్ధానము ముఖము. ముఖము మనస్సునకు అనుగుణముగా యుండును. అందుకే "face is the index of the mind" అన్నారు. జ్ఞానము, ప్రేమ, శాంతి మొదలగు కల్యాణ గుణము లన్నియు మనస్సును ఆశ్రయించి యున్నవి. మనస్సు కల్యాణ గుణములతో పరి పూర్ణమైనపుడు ముఖము నందు సౌందర్యము పరిపూర్ణ మగును. ఆది శంకరుల మనస్సు అంతయు బ్రహ్మజ్ఞానముతో నిండియున్నది. కావుననే ఆయన ముఖము ఎంతో సుందరముగా బ్రహ్మవర్ఛస్సుతో నిండియున్నది. అట్లే కృష్ణుని మనస్సు ప్రేమతో నిండియున్నది. కావుననే ఆయన ముఖము నందున షోడశ కళలు తాండవించుచుండును. రాముని మనస్సు శాంతితో నిండియున్నది. కావున ఆయన మనస్సు ప్రసన్నముగా ఎంతో కోమలముగా యుండును. బుద్ధుని మనస్సు కరుణతో నిండియున్నది. కావున ఆయన ముఖము నందు అమృతము చిందు చున్నది. ఈ విధముగా ఆత్మ సౌందర్యము బాహ్య సౌందర్యమునకు కారణమై యున్నది. దేహముతో పాటు బాహ్య సౌందర్యము నశించుచున్నది. కాని ఆత్మ సౌందర్యము జీవాత్మను ఆశ్రయించి నిత్యముగా యుండుచున్నది. ఈ గుణములను బట్టియే ముఖములో కళలు ఉండుచున్నవి. కావుననే ముఖమును బట్టియే గుణములు చెప్పుట వచ్చి యున్నది. కావున కల్యాణ గుణములలో ఒకే ఒక్క గుణము అగు సౌందర్యము దేహమును ఆశ్రయించి ఉన్నది. మిగిలిన కల్యాణ గుణము లన్నియు మనస్సును ఆశ్రయించి యున్నవి. మనస్సు, వాక్కు, దేహము అనునవి త్రికరణములు. ఈ కల్యాణ గుణములు వాక్కు నందు కూడ ప్రతిబింబించు చుండును. కావున పరమాత్మ యొక్క వాక్కు ఎంతో సుందరముగా యుండును. భగవద్గీతా శ్లోకముల యొక్క సౌందర్యము ఏ శ్లోకములకు లేదు. శ్రీ కృష్ణ భగవానుడు పరిపూర్ణావతారము. కావున ఆయన మనస్సుతో సమానమైన ఆత్మ సౌందర్యము ఎచ్చటను కనుపించుట లేదు. అట్లే ఆయన వాక్కులగు భగవద్గీతా సౌందర్యము కూడా ఏ వాక్కులకును గోచరించదు. అదే విధముగా ఆయన రూపముతో సమానమైన బాహ్య సౌందర్యము ఎచ్చటను కనిపించదు. శరీరము యొక్క సౌందర్యము, ఆత్మ సౌందర్యము యొక్క గుణములు, ఆహారము మీద కూడా ఆధారపడి యుండును. సాత్వికాహారము తేజస్సును ప్రసాదించును. శ్రీ కృష్ణుడు ఎల్లప్పుడును సాత్వికాహారమగు పాలు, పెరుగు, వెన్న భుజించెడివాడు. ఆయన మాంసాహారమును ఎప్పుడును అంటలేదు. కావుననే భగవద్గీతలో సత్వము, రజస్సు, తమస్సు అను మూడు గుణములను కలిగించు ఆహారమును గురించి స్వామి వివరించినాడు. సాత్వికాహారము సత్వగుణమును పెంచి తేజస్సును పెంచి బాహ్య సౌందర్యమును ఆత్మ సౌందర్యమగు కల్యాణ గుణములను వృద్ధి చేయును.

శ్రీ దత్త భగవానుడును ఎల్లప్పుడును గోక్షీరమునే స్వీకరించెడివాడు. కావున ఆయన ముఖమునందు బ్రహ్మవర్ఛస్సు ఒక సముద్రము వలె ఉప్పొంగు చుండెడిది. సత్వము జ్ఞాన కారకము కనుక ఆయన కున్న జ్ఞానము ఎవరికి ఉండెడిది కాదు. దత్తుని యొక్క వాక్కు ఎంతో మాధుర్యముతో నిండి కోటి వీణలు మీటినట్లుండును. కావున ఆహారము దేహము యొక్క రూపమునకు వాక్కుల యొక్క పద్ధతికి గుణములకు ఎంతో ముఖ్యమైనది. సాత్వికాహారముతో పాటు యోగము కూడ యుండవలెను. ఇది ఆహారము కన్నను ముఖ్యము. యోగము అనగా ఎల్లప్పుడును భగవంతుని గురించిన భావములు, వాక్కులు, క్రియలు ఉండుట. దీనిచే ఈ సృష్టిలో ఉన్న అన్ని వస్తువుల మీద అందరు వ్యక్తుల మీద బంధము తెగిపోవును. లోకములో వ్యక్తుల మీద వస్తువుల మీద బంధములే అన్ని చింతలకు కారణము. కాలిన ఇనుప కడ్డీని పట్టుకుని చేయి బోబ్బలెక్కుచున్నదని పామరుడు కేకలు పెట్టును. అతడు ఇనుప కడ్డీ వేడిని తీసివేయమనియు, లేక తన చేతికి బోబ్బలు రాకుండా చేయమనియు భగవంతుని ప్రార్ధించుచున్నాడే తప్ప, ఆ ఇనుప కడ్డీని వదల లేకుండా యున్నాడు. ఇనుప కడ్డీ నుండి వేడిని తీసివేయుట లేక చేతికి బోబ్బలు ఎక్కకుండా చేయుట ఎంత కష్టము. ఇనుప కడ్డీని వదలి వేయుట ఎంత సులభము. సులభమైన పనులు చేసి చేయి కాలకుండా చేసుకొనుట జీవుడే స్వయముగా చేయవలయును. ఒక పని సులభముగా చేయు అవకాశముండగా భగవంతుని కష్టపెట్ట నేల? భగవంతునికి కష్టము కాదు అందురా? ఆ కష్టము కాని పనిని జీవుడే చేయవచ్చును గదా? అయితే ఈ లౌకిక బంధములను తెంచుకొనుట చేతకాక యున్నది అని జీవుని వాదము. అసలు జీవుడు ఏ ప్రయత్నము చేయకయే ఈ లౌకిక బంధములు సులభముగా తెగిపోవు ఏకైక మార్గము గలదు. అదే యోగ శాస్త్రము. దానికి అధినాధుడే శ్రీ దత్తాత్రేయుడు. అది ఏమి అనగా నీవు నీ మనో వాక్కాయ కర్మలన్నింటిని భగవత్పరము చేయుము. నీవు భగవంతుని మాధుర్యము రుచి చూడగనే ఈ లౌకిక బంధము లందు ఎట్టి ప్రయత్నము లేక స్వయముగనే నశించును. అమృతము త్రాగిన వాడు కాఫీని స్వయముగనే వదలివేయును. అప్పుడు కాఫీని వదలి వదలివేయుటకు ఎట్టి ప్రయత్నము అక్కరలేదు. అమృతము రుచి చూడకుండా కాఫీని వదలుట అసంభవము. కావున భగవద్‌ యోగమునకు ప్రయత్నించుము. ఈ యోగము సిద్ధించిన వైరాగ్యము ప్రయత్నము లేకయే సిద్ధించుచున్నది. లౌకిక బంధములు తెగిపోయినచో నీకు ఎట్టి చింతలు ఉండవు. ఈ చింతయే ఒక మహాగ్ని. అగ్నిలో కాలిన వాడు బాహ్య సౌందర్యమును కోల్పోవును. చింతలో కాలిన వానికి ముందు ఆత్మ సౌందర్యము కాలిపోయి, దాని ప్రభావము చేత బాహ్య సౌందర్యము కూడ నశించును. కావున లౌకిక బంధములలో ఉండుచు యోగము ద్వారా చింతలు అను మంట అంటకుండ మెలుగు వాడే యోగి, అట్టి యోగియే పరమ సుందరుడు. ఈ లోకములో పరమ సుందరుడు ఎవరు అనగా హనుమంతుడు. అందుకే ఆయనను గురించిన కాండకు సుందరాకాండ అని పేరు వచ్చినది. ఆ కాండలో ప్రతిక్షణము క్లిష్టమైన సమస్యలలో హనుమంతుడు చిక్కుకుంటాడు. కాని ఆయనను ఏ చింత మంట అంటలేదు. ఇదే హనుమంతుని తోకకు అగ్ని అంటించిననూ ఆయన కాల లేదు అను ఘట్టములోని అంతరార్ధము. భగవద్గీతయను యోగ శాస్త్రమంతయును ఆత్మ సౌందర్యము, మరియు బాహ్య సౌందర్యములను కాపాడుకొను మార్గమే. సౌందర్య ఆది దేవుడైన శ్రీ కృష్ణ భగవానుడు బోధించి యున్నాడు. కావున ఆయనను సత్యం, శివం, సుందరం అన్నారు.

At the lotus feet of Shri Datta swami
-Durgaprasad

Saturday, October 2, 2010

All scriptures say "Sacrifice of fruit of work (money) is the highest"

The scriptures say that your sacrifice of money is highest.

1) In the very beginning itself (second Adhyaya), Gita says that the fruit of the work must be sacrificed (Karmajam Buddhi Yuktahi Phalam Tyaktva Maneeshinah). This means that realized scholars sacrifice the fruit of the work. Gita keeps sacrifice of the fruit of the work on the top most level. Gita says ‘Jnanat dhyanam visishyate, Dhyanat Karma Phala Tyagah’i.e., Bhakti (devotion) is better than Jnana (knowledge) and sacrificing the fruit of your work (money) is better than Bakthi.

2) Gita says ‘Sarva karma Phala tyagam prahus tyagam vichakshanah’ i.e., if you can give the fruit of the entire work to the Lord, then that is real sacrifice.

3) ‘Na karmana, Na prajaya, Dhanena tyagenaike Amritatvamaanasuh’ i.e., you cannot attain God by selfish work or the children. You can attain God only by sacrificing your money for God’s work. – The Veda

4) The first words of the first Upanishath (Easavaasyam) says, ‘Tena tyaktena Bhunjeedah’ ‘Ma gradha ha kasyasvit Dhanam’ i.e., this entire world is the money of the Lord. Take whatever you require from His wealth; don’t take extra which is not permitted by the God. If you have taken, you are a thief. Return it back to the Lord.

5) Veda says ‘Samvidha’ ‘Shraddhayaa’ ‘Hriya’ ‘Bhiya dheyam’, i.e., return the extra to the Lord in human form after recognizing Him through His Jnana. Wait patiently till you recognize the Lord in human form. When you are donating your money to Him (actually you are giving Him His own money) you should give it with fear and feel shy.

6) In Yoga Vasistha the Guru Vasista says to Rama (Dhanamarjaya) i.e., bring money and offer it to me as Guru Dakshina before I can teach you the Jnana.

7) Shirdi Sai used to ask Guru Dakshina from everybody to teach this important sacrifice. He criticized a merchant who came for Brahma Jnana but was not giving even Rs.5/- from his pocket. Mr. Patil, a farmer used to donate the entire yearly crop to Baba and took back whatever Baba gave back to him.

8) In bible:
Matthew–6 : 19 to 22
‘Do not Lay up for yourselves, treasures on earth. But lay up for yourselves treasures in heaven. For where your treasure is there your heart will be also’.
Matthew -7: 21
‘Not everyone who say to Me, ‘Lord, Lord’ shall enter the kingdom of heaven, but He who does the will of My Father in Heaven’.

9) In islam:
Holy Islam speaks about the sacrifice of fruit of work (money) through the word ‘Jakaat’. This word says that every rich man is expected to practice the sacrifice within the limit of his wealth. Islam says that people are loving too much the money (Q’ran: AalFajr – 20). Islam says that by sacrifice of money your wealth will not decrease and in fact your wealth increases by sacrifice. Islam also mentions that by sacrifice of money your wealth becomes most pure.

At the lotus feet of Shri Dattaswami
-durgaprasad

Wednesday, September 15, 2010

అపిచేశ్చ దురాచార - గీత

"అపిచేశ్చ దురాచారః భజతేమాం అనన్యభాత్‌
సాధురేవ సయంతవ్యః సమ్యత్‌ వ్యవసితోసిన"
అని గీతలో స్వామి చెప్పినారు. అనగా ఎంత దురాచారుడైనను మరియొక వస్తువును గాని, మరియొక వ్యక్తిని గాని కోరక నన్నే ఏ జీవుడు భజించునో, అట్టి జీవుడే నిజమైన పుణ్యాత్ముడు. అతడు చేసినది పుణ్యమే కదా! అనగా ఎంతటి పాపియైనను, స్వామి యొక్క భక్తుడైనచో పుణ్యాత్ముడనియు, అయితే అట్టి వాని యొక్క భక్తి అనన్య భక్తిగా ఉండవలయుననియు అట్టివాడు పాప ఫలమును పొందడనియు చెప్పబడి యున్నది. అనగా ఎన్ని పాపములు చేసినను, అనన్య భక్తితో స్వామిని సేవించిన వాడు పుణ్యాత్ముడని స్వామియే చెప్పుట సరిగా లేదని కొందరు భావించుచున్నారు. కాని సత్యమును విచారించినచో స్వామి చెప్పినది అక్షర సత్యమని తేలుచున్నది. ఏలననగా ఈ సర్వజగత్తును సృష్టించిన వాడు, నిన్ను సృష్టించిన వాడు, నీకు ఆయురారోగ్యము లిచ్చిన వాడు, నీకు సకల భోగములను ఇచ్చి ఆనందిప చేయుచున్న వాడు స్వామియే. నీ శరీరము లోపల వున్న గుండె, ఊపిరితిత్తులు, జీర్ణ కోశము, మూత్రపిండములు మొదలగు అనేక అవయవములను పని చేయించుచున్నవాడు స్వామి. నీవు స్వామికి సంపూర్ణముగా ఋణపడి యున్నావు. ఉదయకాలము నిన్ను నిద్ర నుండి లేయుచున్నట్లు చేయుచున్నవాడు స్వామి. నీవు స్వామికి ఏది సమర్పించినను, ఏ సేవ చేసినను ఆ ఋణము తీరదు. ఈ మానవ జన్మను ఎత్తుటకు ముందు, నీవు పరలోకమున విచారణకు నిలబడి యున్న సమయమున, నీ విచారణను ప్రక్కకు నెట్టించి నీకు మరల ఈ మానవ జన్మమును ప్రసాదించిన వాడు స్వామి. ఇన్ని ఉపకారములు చేసిన స్వామికి నీవు కృతజ్ఞతలు చెప్పకున్నచో కృతఘ్నత అను మహా పాపమును పొందుదువు. నీవు కృతజ్ఞతను చెప్పినచో అది మహా పుణ్యము. కృతజ్ఞతను మించిన పుణ్యము లేదు. కావున నీవు కృతజ్ఞతను చెప్పినచో, నీవు ఎన్ని పాపముల చేసిననూ అవి అన్నియు దాని కన్న తక్కువ కావున నీవు పుణ్యుడవే అగుదువు. ప్రతి దినము ఆయనకు కృతజ్ఞతలు చెప్పుచున్నచో నీ పుణ్యము +100 అగును. నీవు ఎన్ని పాపములు చేసినను అవి అన్నియు -99 మాత్రమే అగును. అప్పుడు +1 మిగులును. కావున స్వామి భక్తుడు పుణ్యాత్ముడే. నీవు కృతజ్ఞత వ్యక్తము చేయక దైవమును అంగీకరించక నాస్తికుడవైనచో నీ కృతఘ్నతా పాపము -100 అగును. నీవు ఎన్ని సార్లు పుణ్యకార్యములు చేసినను అవి అన్నియును +99 మించిపోలేవు. కావున అట్టి నాస్తికునకు -1 మిగులుచున్నది. అనగా భగవద్భక్తుడు ఎన్ని పాపములు చేసినను +1 మిగులుట చేత పుణ్యాత్ముడే అగును. ఆట్లే నాస్తికుడు ఎన్ని ధర్మ కార్యములు చేసినను -1 మిగులుట చేత పాపాత్ముడే అగును. ఏలననగా, కృతజ్ఞతకు మించిన పుణ్యము లేదు. కృతఘ్నతకు మించిన పాపము లేదు. అయితే ఈ శ్లోకము యొక్క అర్ధము ప్రకారము భగవద్భక్తుడైన చాలును ఎన్ని పాపములనైనను చేయవచ్చును అని కాదు. భగవద్భక్తుడై పాపములు చేసిన వానికి మిగిలిన పుణ్యము +1 మాత్రమే. కాని భక్తుడై పుణ్యము చేయువారి సంగతి ఏమి? భగవద్భక్తికి +100 పుణ్యకార్యములకు +99 మొత్తము +199 అగుచున్నది. కావున +1 గురించి చెప్పుట +1 తెచ్చుకొనమనుటయే. అట్లే నాస్తికుడై పాప కార్యములు చేయువాడు వాని నాస్తికత్వమునకు -100, వాని పాపకార్యములకు -99 మొత్తము -199 అగుచున్నది. ఇది -1 కన్నను -199 చాలా ఎక్కువ. కావున ఈ శ్లోకము యొక్క సారాంశము ఆస్తికుడై ధర్మమును ఆచరించువాడు పరమ పుణ్యాత్ముడు.

ఆస్తికుడై పాపములను ఆచరించని వాడు స్వల్పమైన పుణ్యాత్ముడు. అట్లే నాస్తికుడై ధర్మమును చేయువాడు స్వల్పమైన పాపాత్ముడు. నాస్తికుడై పాపములను చేయువాడు మహా పాపి యగును. అయితే ధర్మము అనగా నేమి? అధర్మము అనగా నేమి? ధర్మము, అధర్మము అను రెండు శబ్ధములు నీ తోటి జీవించు సాటి జీవుల వ్యవహారముకు సంబంధించినవి కాని స్వామికి సంబంధించినవి కావు. ధర్మము అనగా సజ్జనులను భగవద్భక్తులను బాధించకుండా వారికి ఉపకారము చేయుటయే. అట్టి వారిని బాధించుట, వారికి అపకారము చేయుట అధర్మము. ఈ ధర్మము మార్గ స్వరూపముగను, ఫలస్వరూపముగను ఉండును. ఈ రెండింటి లోపల స్వరూపమే ప్రధానము. ఫల స్వరూపము అనగా నీవు ఒక కర్మ చేసి చిట్ట చివరకు సాధించినది. దానినే గమ్యము లేక లక్ష్యము అందురు. గమ్యము ధర్మమైనచో మార్గము ధర్మమే. ఉదాహరణకు ఒక సజ్జనుడి జేబులో నుండి 10 రూపాయలను ఒక దుర్జనుడు దొంగిలించినాడు. ఆ దొంగిలించిన పది రూపాయిలు దుర్జనుడు తన స్వార్ధముకు వినియోగించుకున్నాడు. కావున ఇచ్చట లక్ష్యము అధర్మము. కావున దొంగతనము అధర్మము. కాని దుర్జనుని వద్ద నుండి ఆ పది రూపాయిలు దొంగిలించి ఆ సజ్జనునికి తిరిగి యిచ్చివేసినాము. ఈ రెండవ దొంగతనము అధర్మము కాదు. ఏలననగా లక్ష్యములో స్వార్ధము లేదు. లక్ష్యములో త్యాగమున్నది. లక్ష్యము ధర్మస్ధాపనయే. అయితే దుర్జనుడితో యుద్ధము చేయగలిగి యుద్ధము చేసి వానిని తన్ని ఆ పది రూపాయిలు లాగుకొని ఆ సజ్జనుడికి ఇచ్చినచో ఇచ్చట మార్గము, గమ్యము రెండు ధర్మములే అగుచున్నవి. కాని దుర్జనుని తన్నుటకు శక్తి లేనప్పుడు ధర్మ మార్గము అచ్చట కుదరదు. వాని వద్ద దొంగిలించియైనను దానిని సజ్జనునకు ఇచ్చివేయుటయే కర్తవ్యము. ఈ దొంగతనము పాపము కాదు. దొంగతనము చేయు నైపుణ్యము ఉండి కూడ ఈ సందర్భమున దొంగతనము పాపమని దొంగతనము చేయకున్నచో అట్లు చేయకపోవుటయే పాపమగుచున్నది. "రామో విగ్రహవాన్‌ ధర్మః" అన్నారు. అనగా రాముడు మూర్తీభవించిన ధర్మ స్వరూపము అని అర్ధము. అట్టి రాముడు చెట్టు చాటు నుండి వాలిని చంపుట యుద్ధ ధర్మము కాదని వాలి రాముని ఆక్షేపించినాడు. కాని ఇచ్చట రాముడు చేసినది ధర్మమే. ఏలననగా వాలికి ఒక వరము కలదు. యుద్ధము చేయునప్పుడు ఎదుటి వాని శక్తి నుండి సగము వాలికి లభించును. దీని వలన వాలిని ఎవడు జయించలేడు. వాలి అధర్మమును చేసినాడు. సుగ్రీవుని భార్య యగు రమను బలవంతముగా భార్యగా చేసుకొని, సుగ్రీవుని వెడలకొట్టినాడు. అప్పటి కాలమున వానరులలో దేవర న్యాయమున్నది. అనగా సోదరులలో ఒకరు మరణించినపుడు మరణించిన వాని భార్య ఇష్టమైనచో బ్రతికియున్న సోదరునికి భార్య కావచ్చు. కాని సుగ్రీవుడు మరణించలేదు. మరియు రమకు ఇష్టము లేదు. కావున ఇది రెండు విధములుగను అధర్మమే. అయితే వాలి ఎందుకు ఇట్లు చేసినాడు? దుందుభి యను రాక్షసునితో యుద్ధము చేయుటకు ఒక కొండ గుహలోనికి వాలి పోవుచు సుగ్రీవుని కాపలా పెట్టి నెల రోజులలో నేను తిరిగిరానిచో, నన్ను మరణించి నట్లుగా భావించి తిరిగి పోమ్మన్నాడు. నెల రోజులు దాటినను వాలి రాలేదు. కావున అన్న ఆజ్ఞ ప్రకారము అన్న మరణించెనని భావించి దుందుభి బయిటకు రాకుండగా ఆ గుహ ముఖమునకు పెద్ద రాతిని అడ్డుపెట్టి సుగ్రీవుడు వచ్చి రాజ్యాభిషిక్తుడైనాడు.
వాలి భార్య తార ఇష్టపడి నందున దేవర న్యాయ ప్రకారముగా సుగ్రీవునకు భార్యయైనది. కాని అచ్చట వాలి దుందుభిని చంపి తాను రాకుండా సుగ్రీవుడు రాతిని అడ్డము పెట్టినాడని క్రోధావేశముతో అన్నమాట మరచి వచ్చి తార, రమ సహితుడైన సుగ్రీవుని చూచి రెట్టించిన కోపముతో సుగ్రీవుడు ఏమి చెప్పినను వినక, సుగ్రీవుని వెడలకొట్టి రమకు ఇష్టము లేకపోయినను, బలవంతముగా భార్యను చేసుకున్నాడు. భర్త మరణించినపుడు కూడ దేవర న్యాయములో స్త్రీ యొక్క అంగీకారము ప్రధానమైయున్నది. కావున చూచుటకు సుగ్రీవుడు చేసిన పని, వాలి చేసిన పని ఒకటిగా కనిపించును. కాని ఎంతో బేధమున్నది. కావున వాలి వధార్హుడు. ఆనాడు భారత దేశమంతయును ఇక్ష్యాకుల సామ్రాజ్యమై యున్నది. అనగా అయోధ్య రాజుదే కేంద్ర పభుత్వము. అయోధ్యరాజు భరతుడు. రాముడు తన రాజ్యమును 14 సంవత్సరములు మాత్రమే అప్పచెప్పినాడు. కనుక భారత దేశములో ఎచ్చట అధర్మము జరిగినను, శిక్షించుటకు రామునికి అధికారమున్నది. ఇది అంతయును రాముడు వాలికి వివరించి ఇట్లు చెప్పినాడు. వాలీ! నిద్రపోవుచున్న ఏ ప్రాణిని వధించరు. కాని ఒక పెద్దపులి గ్రామము పైబడి జనులను వధించున్నపుడు అది మేల్కోని యుండగా దానిని ఎవరును వధించలేరు. కాని అది నిద్రపోవుచున్నది. ఈ సందర్భమున ధర్మ శాస్త్రమును అతిక్రమించి దానిని వధించుట ధర్మసూక్ష్మము. ధర్మము కన్న ధర్మ సూక్ష్మము గొప్పది.
At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

Friday, August 20, 2010

భగవద్గీత

శ్రీ కృష్ణ భగవానుని ఒక్క స్వరూపమే భగవద్గీత. కృష్ణుడు అనగా ఆకర్షించు వాడు అని అర్ధము. ఆయన యొక్క అంత: స్వరూపమే నారాయణుడు. నారాయణుడు అనగా జ్ఞానమునకు ఆధారమైన వాడు అని అర్ధము. కావున ఆయన యొక్క నిజమైన ఆకర్షణ ఆయన ఎత్తిన భగవద్గీత మూలమునే యున్నది. ఆయన గోకులములో పుట్టి పామరులకు సైతము వ్రజ భాషలో ఎంతో విలువ గల జ్ఞానవాక్యములను చెప్పుచుండెడివాడు. ఆయన చెప్పిన వాక్యములే గీతలో శ్లోకములుగా వచ్చినవి. కృష్ణుడు ఎల్లప్పుడును తక్కువ వాక్యములనే పలుకు చుండెడివాడు. అయితే గోకులమున పుట్టిన గోపికలు పూర్వజన్మమున బ్రహ్మర్షులు కావున ఆయన చెప్పు తత్త్వ వాక్యములకు ఎంతో ఆకర్షించబడి స్వామి వద్దకు వచ్చెడివారు. గోపికలకు ఉన్న శ్రద్ధ మిగిలిన యాదవులకు అంతగా ఉండెడిదికాదు. ఏలననగా ఆ యాదవులు సామాన్య జీవులు. కృష్ణుడు ఎప్పుడును హృదయాంతరముల స్పందిపజేయు మధురాతి మధుర గీతములను పాడుచు వాటిని మురళితో వాయించెడివాడు. ఆ గీతము లన్నియును పరమాత్మనే లక్ష్యముగా చేసుకొని సత్యమైన భక్తిని బోధించెడి అమృతధారలుగా ఉండెడివి. ఆ గీతములన్నియును భగవత్‌ ప్రేమతో నిండియుండుట వలన వాటిని విని స్వామితో వంత పాడుచు గోపికలు మైమరచెడివారు. ఆ భక్తి గీతములతో గోపికల బ్రహ్మానంద సముద్రమున మునిగిపోయెడివారు. ఇదియే బృందావనములోని రాసకేళి. రాసకేళి అనగా ఒక దివ్యమైన మధురాతి మధురమైన భజన. కాని నేడు రాసకేళి గురించి అవి ఏవో సినిమా జ్యూయట్‌ సాంగ్‌లని అపార్ధము చేసుకొనుచున్నారు. అక్కడ ఉన్న కృష్ణుడు సాక్షాత్‌ పరమాత్మ. ఆ గోపికలు యుగ యుగములు తపస్సు గావించిన బ్రహ్మర్షులు. అదియే వారి చివరి జన్మ. కృష్ణుడు ఆనాడు తాను వచించిన జ్ఞాన వాక్యములనే పాటల రూపములలో రాసకేళిలో పాడెడివాడు. అదియే జ్ఞానము మరియు ప్రేమ అను భగవంతుని రెండు కల్యాణ గుణముల కలయిక. ఆ గోపికలు మహా పండితులైన ఋషులు. వారు జ్ఞానమును కఠినములైన వాక్య శాస్త్రముల ద్వారా అప్పటి వరకు చర్చించి వచ్చినవారు. వారు అప్పటి వరకు జ్ఞానమును వాక్యములలో మరియు శ్లోకములలో చర్చించెడివారు. ఆ వాక్యములే యజుర్వేదములు. శ్లోకములే ఋగ్వేదము. అదే జ్ఞానము మధురమైన గీతముల ద్వార ఉన్నపుడు సామవేదమగును. అందుకే కృష్ణుడు "వేదానాం సామవేదోస్మి" అన్నాడు. ఆయనకు జ్ఞానము మధురమైన ప్రేమయు చాల ఇష్టముగ నుండును. కురుక్షేత్రములో ఆయన అర్జునునకు వినిపించినవి కూడా పాటలే. కావుననే దానిని భగవద్గీత అన్నారు. భగవద్గీత అనగా భగవంతునిచే పాడబడిన గీతలు లేక పాటలు అని అర్ధము. ఈ పాటలను ప్రతి దినము బృందావనము నందు గోపికలకు వినిపించినాడు. ఈ పాటలనే యమునా తటమున తమాల (గానుగ) వృక్షశాఖపై ఆశీనుడై ఏకాంతముగా మురళితో పాడెడివాడు. కావున ఆయన యొక్క వేణుగీత గాని రాసకేళిలో పాడిన పాటలు గాని భగవద్గీతా శ్లోకములే. భగవద్గీత రజోగుణముతో కూడిన అహంకారముతో నున్న క్షత్రియుడైన అర్జునుడికి చెప్పబడినవి. అర్జనుడు కూడ పూర్వజన్మమున నరుడు అను ఋషియే. కాని క్షత్రియ కులమున పురుషునిగా పుట్టినాడు. పార్ధునికి కుల అహంకారము, లింగాహంకారము ఉన్నది. అంతే కాదు తాను మహా వీరుడన్న అహంకారము కూడ ఉన్నది. కావున పార్ధునికి చెప్పిన భగవద్గీతలో కొంచము కాఠిన్యము ఎక్కువగా కనిపించుచు మిరపకాయ బజ్జీ వలె ఉన్నది. కాని గోపికలు స్త్రీ జన్మనెత్తి గొల్లలను శూద్ర కులమున పుట్టి లింగాహంకారము కులాహంకారము లేక సంపూర్ణ శరణాగతి చేసినారు వారు. కావున గోపికలకు చెప్పిన జ్ఞానగీతలు పంచదార రసగుల్లాల వలెనున్నవి. ఆ గీతల యొక్క నామధేయమే రాసకేళి. రాసము అనగా మధుర ప్రేమ రసముతో నిండిన సముద్రము. కేళి అనగా దాని యందు ఈదులాడుచూ స్నానము చేయుట. ఆ సమయము స్వామి ఆపాదమస్తకము మధుర ప్రేమ స్వరూపమున ఉండెడివాడు.

ఆ స్వరూపము గురించియే "మధురాతి పతియే అఖిలం మధురం". సాత్వికులైన బ్రహ్మర్షుల యొక్క జ్ఞానముతో కూడిన గోపికల మధుర ప్రేమ వాతావరణమే బృందావనము. జీవుని యొక్క గుణముల బట్టియే వాతావరణము మరియు స్వామి స్వరూపము కూడ ఉండును. పార్ధుని యొక్క గుణముల బట్టియే కురుక్షేత్ర వాతావరణమున గీతను చెప్పవలసి వచ్చినది. రజోగుణము అహంకారమయమైన యుద్ధ వాతావరణమున స్వామి కూడ పాంచ జన్య శంఖమును పూరించుచు రణోత్సాహముతో వరావృశముతో పరుష స్వభావముగానున్నారు. గుణమును బట్టియే మనస్సు మరియు వాతావరణము మరియు దానికి అనుగుణముగా వాక్కు ఉండును. మరి ఆనాటి రాసకేళి గ్రంధమును వ్యాసుడు ఏల గ్రంధస్ధముగావించలేదు. అది ద్వాపరయుగాంతము. అతి స్వల్పకాలములోనే కలియుగము రాబోవుచున్నది. ఆ రాసకేళి గీతముల శ్రవణము చేయు అర్హత గల జీవులు లేరు. అందరును రజోగుణముతో అర్జునుని తాత ముత్తాతల వంటి జీవులు ఉన్నారు. కావున ఈ జీవులకు యోగ్యమైనది పార్ధునికి చెప్పిన ఈ భగవద్గీతయే. ముందు భగవద్గీత యను ఉట్టికి ఎక్కినచో తరువాత మాట రాసకేళి యను స్వర్గమునకు ఎక్కుట. మరియు అయోగ్యులగు ఈ జీవులు ఆ రాసకేళి గీతలను అపార్ధము చేసుకొనెదరు. విమర్శంతురు. అర్జునుడే విమర్శంచినాడు కృష్ణపరమాత్మను. గయోపాఖ్యాన సందర్భమున "సతులయే మార్చి గొల్లభామల మరుగుట కాదు" అన్నాడు. ఆ రాసకేళి గీతములను అర్జునుడు వినలేదు. పరమ భక్తుడగు నారాయణుని వెంట నీడ వలెనున్న నరుడు అనబడు ఋషియగు అర్జునుడే తన ఉపాధి అగు క్షత్రియ వీర పురుషజన్మ ప్రభావము చేత ఇట్లు పలికినపుడు ఇక మిగిలిన శిశుపాల దుర్యోధన జరాసంధాది రాజుల సంగతి చెప్పనేల? ఆనాడు రాసకేళి గీతములలో చెప్పిన అనేకానేక అద్భుత జ్ఞాన రహస్యములను కరుణామయుడగు స్వామి ఈనాడు జ్ఞాన సరస్వతి ద్వారా జీవులకు అందించుచున్నాడు. ఇవి అన్నియును వేదములలో కలవు. కావున ఆ వేదములు ఖిలమై పోయినవి. "అనంతావై వేదా హః" అనగా వేదములకు అంతము లేదు. భరద్వాజుడను ముని 300 సంవత్సరములు వేదములను చదివినాడు. ఆయనకు స్వామి సాక్షాత్కరించి మూడు మహా పర్వతములను చూపినాడు. ఒక్కొక్క పర్వతము నుండి ఒక్కొక్క పిడికిలి మట్టి తీయమన్నాడు. స్వామి ఇట్లు చెప్పినాడు. ఓ భరద్వాజ! నీవు చదివిన వేదము ఈ మూడు పిడికిళ్ళ మట్టి మాత్రమే ఇంకనూ చదవవలసిన వేదము ఆ మహా పర్వతములు అన్నాడు. ఈ కధ వేదము నందే కలదు. "భరద్వాజో హవైః" అను మంత్ర పాఠమున కలదు. భరద్వాజుడు 300 సంవత్సరములలో చదివిన వేదములలో ఒక సంవత్సరము మాత్రమే చదివిన వేదము మనకు ఈనాడు మిగిలియున్నది. మిగిలిన 299 సంవత్సరముల వేదము ధారణ చేయలేక మరచిపోయినారు. దీనిని "ఖిల వేదము" అందురు. ఖిలము అనగా అంతరించినది అని అర్ధము. కావున స్వామి యొక్క జ్ఞానము అనంతమైనది. గోపికల రూపములో ఋషులు ఎందుకు అంతగా ఆకర్షించబడినారు. స్వామి గీతలలో చెప్పెడి జ్ఞానము వారు అధ్యయనము చేసెడి వేదములలోఉండెడిది కాదు. అది అంతవరకు శ్రవణము చేయని విజ్ఞానము. కావున వారికి ఎంతో శ్రద్ధ ఉండెడిది. ఆ శ్రద్ధయే కృష్ణునిపై ఏర్పడిన ఆకర్షణ. ఆ శ్రద్ధ ముందు అన్నపానీయములు కాని, నిద్ర కాని, అత్తమామలు కాని, పతిపుత్రులు కాని, గృహ, పశు, క్షేత్ర బంధములు కాని నిలువలేక పోయినవి. కావున రాసకేళి అనగా మహా పవిత్రమైన వేదాధ్యయనము. అది ఈశ్వర జీవుల గురు శిష్యులు కావుననే భాగవతము ఏడు దినములలో మోక్షమునీయ గల మహా పవిత్ర గ్రంధమైనది.

At the lotus feet of Shri Datta Swami
-Durgaprasad

Thursday, July 1, 2010

బహునాం జన్మ నామంతే

బహునాం జన్మ నామంతే అనగా ఎన్నో జన్మల తపస్సాధన ఉన్నగానే నన్ను గుర్తించలేరు, అనియు "యతతామ్‌పి సిద్ధానాం కస్చిన్‌ మామ్ వేతి తత్త్వత" " అనగా అష్ట సిద్ధులు సంపాదిచినను, ఎట్టి అహంకారమును పొందక నా కొరకు సాధన సాధించు ఏ ఒక్కడో నన్ను గుర్తించును అని గీత చెప్పుచున్నది. అసలు బ్రహ్మమును గుర్తించు బ్రహ్మ విద్యలో అంత కష్టము ఏమున్నదని ఎవరికైనను సంశయము రావచ్చును. కొందరు బ్రహ్మము నిరాకారమైన, సర్వవ్యాపకమైన చైతన్యమను చున్నారు. చైతన్యము కాంతి వలె ఒక శక్తి స్వరూపము. పట్ట పగలు కాంతి ఎట్లు సమస్త లోకములను వ్యాపించి యున్నదో, అట్లే చైతన్యము అను శక్తి ఈ సమస్త విశ్వమును వ్యాపించి యున్నది. ఇది అర్ధము చేసుకొనుటలో పెద్ద కష్టమేమున్నది. ఎంత పామరుడైనను అయిదు నిమిషములు ఆలోచించినచో, ఇది అర్ధమగుచునే ఉన్నది. పదవ తరగతి ఫిజిక్సు చదివిన విద్యార్ధి ఈ విషయమును ఒకే నిమిషములో అర్ధము చేసుకొనగలడు. దీని కొరకు ఏన్నో జన్మలు ఎందుకు? మరి కొందరు పరబ్రహ్మము అనగా ఈ విశ్వమును కూడ అత్రికమించిన విరాట్పురుషుని ఆకారము అనియు, ఈ జగత్తు ఆయన ధరించిన ఒక వస్త్రము వంటిది అనియు, ఆయన ఈ విశ్వములో అంతర్యామిగా ఉన్నాడనియు చెప్పుచున్నారు. ఇది ఇంకను సులభము. పామరుడు మూడు నిమిషములలో అర్ధము చేసుకొనగలడు. మరికొందరు పైలోకములో వైకుంఠములో నారాయణునిగాను, కైలాసమున పరమశివునిగాను, సత్యలోకమున హిరణ్యగర్భుని గాను పరబ్రహ్మ ఉన్నాడని చెప్పుచున్నారు. ఇది మరింత సులభము. పామరుడు ఒక్క నిమిషములో అర్ధము చేసుకొనగలడు. కావున ఈ సిద్ధాంతముల ప్రకారము బ్రహ్మవిద్య కష్టము కాదని తేలుచున్నది. శ్రుతులు కూడ పరబ్రహ్మము తర్కమునకు, ఊహకు సైతము అందదు అనియు, దేవతలు కూడ అర్ధము చేసుకొనలేరనియు చెప్పుచున్నవి. కావున వీరు చెప్పు సిద్ధాంతములేవియు బ్రహ్మ విద్యకు అర్ధము కావని తేలుచున్నవి. కావున బ్రహ్మ విద్య అనగానేమి? అది అంత కష్టముగా ఎందుకు ఉన్నది? దీనికి సమాధనము భగవద్గీతయే చెప్పుచున్నది. "బహునాం జన్మ నామంతే జ్ఞానవాన్‌ మం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి పరమాత్మ సుదుర్లభాః" అను శ్లోకమే బ్రహ్మ విద్యను గురించి చెప్పుచున్నది. అనగా వసుదేవుని పుత్రుడగు ఈ వాసుదేవుడు పరబ్రహ్మము అని గుర్తించి పరిపూర్ణముగా విశ్వసించిన మహాత్ముడు ఎక్కడునూ దొరకడు. అనగా దేవకి గర్భమున పుట్టి యశోద చేత పెంచబడి అందరి నరులలో ఒక నరుడుగా ప్రవర్తించుచున్న ఈ వాసుదేవుడే పరబ్రహ్మమని గుర్తించుట చాలా కష్టము అని అర్ధము. ఇచ్చట వాసుదేవ శబ్ధము ప్రతి నరాకారమును గురించి చెప్పుచున్నది. కేవలము కృష్ణావతారమును గురించే కాదు. ఏలననగా అధర్మము తల ఎత్తినపుడల్లా మనుష్య రూపములో నేను అవతరిస్తానని "తదాత్మానం సృజామ్యహమ్‌", "మానుషీం తను మాశ్రితమ్‌" అని తరువాత గీతా శ్లోకములు చెప్పుచున్నవి. నరులలో ఒక నరునిగా అవతరించి ఇతర నరుల వలె ప్రవర్తించుచున్న నరవేషి యగు నారాయణుడని గుర్తించుట చాలా కష్టము. ఇట్లు నరులలో అవతరించిన వానిని గుర్తించుట దేవతలకు కష్టమే అగుచున్నది. ఏలననగా దేవతల కన్న నరులు చాలా తక్కువవారు. కావున వారు నరులను చులకనగా చూతురు.

యాదవ వంశములో పుట్టి నరవేషి యగు నారాయణుని గుర్తించక ఇంద్రుడు ఏడు రోజులు వర్షమును కురిపించినాడు. ఋషులు సైతము భ్రమలో పడుదురు. ఉదంక మహర్షి కృష్ణుని శాపము పెట్టుటకు పూనుకొనినాడు. "అవ జానంతి మాంమూఢాః మానుషీమ్‌ తను మాశ్ర్తితమ్‌" "మమభూత మహేశ్వరమ్‌" అనగా నర వేషమున నున్న నారాయణుని గుర్తించుటలో దేవతలు ఋషులు సైతము మూఢులై ఆయనను అవమానించుటకు పూనుకొందురు అని అర్ధము. ఇప్పుడు చూచితిరా! బ్రహ్మవిద్య ఎంత కష్టమో అందుకే శ్రుతి "బ్రహ్మవిద్‌ బ్రహ్మైవ భవతి" అనగా బ్రహ్మమును గురించిన గుర్తింపు బ్రహ్మమునకే ఉండును అని అర్ధము. అక్రూరుడు, విదురుడు, భీష్ముడు, పార్ధుడు, గోపికలు వంటి మహా భక్తులు కూడ ఒక్కొక్క క్షణములో జారిపోయినారు. ఒక్క క్షణము కూడా జారి పోకుండా నిలబడినది రాధ మాత్రమే. అందుకే ఒకానొక జీవుడు మాత్రమే "కశ్చిన్‌ మాం వేత్తి తత్త్వతః" అని స్వామి గీతలో చెప్పియున్నాడు. ఆమె తన్ను తానే మరచిపోయినది. అనగా "నేను" సాత్విక అహంకారము కూడ లయమైనది. అహంకారము మూడు విధములుగా యుండును. "నేను" అని జ్ఞానము మాత్రమే స్వరూపముగా చైతన్యాత్మకమయమైన భావమే సాత్వికాహంకారము. ఇందులో "నేను" అను శబ్ధమునకు ఆత్మ అని అర్ధమే మిగిలి యుండును. ఈ చైతన్యాత్మ యగు జీవుడు శరీరమును వదలిపోయినను, తనను తాను నేను నేను అనుకొనుచుండును. కావున మరణించిననూ పోనిదే ఈ సాత్వికాహంకారము. ఇంక ఈ శరీరమును నేను అనుకొనుట రాజసాహంకారము. నేను ఎర్రగా ఉన్నాను అనుచున్నాడు. ఎర్రగా ఉన్నది శరీరము. ఈ శరీరముతో నేను ఏకీభవించుటయే రజోగుణము. ఈ శరీరము అగ్నిలో దగ్ధమగుననియు, అప్పుడు దగ్ధము కాకుండా బయిటకు వచ్చు ఆత్మయే "నేను" అను శబ్ధమునకు అర్ధము అని తెలియదు. కావున రజో గుణము అజ్ఞానమే. సాత్విక గుణము జ్ఞానము. ఏలననగా నశించిన చైతన్యాత్మ "నేను" అనుకొనుట జ్ఞానమే కదా! అది సత్యమే గదా! ఇక తనకు తోడుగా ఉన్న ధనము బంధువులు మొదలగు వానిని "నేను" అనుకొనుట తమో గుణము. సాత్వికాహంకారములో "నేను" అనునది నిలచినంత వరకు చైతన్యము పరిమితమై ఒక ఖండముగా ఉండును. ఎప్పుడు ఈ "నేను" అన్న సాత్వికాహంకారము కూడ నశించునో, అప్పుడు ఈ చైతన్య ఖండమైన ఆత్మ పరమాత్మ యొక్క చైతన్యము నందు లయించిపోవును. అప్పుడు "నేను" అను శబ్ధము కేవలము పరమాత్మ చైతన్యమునకు మాత్రమే మిగిలిపోవును. ఇదే శంకరాచార్యుల వారు తరువాత రమణ మహర్షి చేసిన నేను అను శబ్ధము యొక్క జిజ్ఞాస. ఈ విధముగా ఎవరు స్వామి సేవలో పాల్గొని తనను తాను మరచిపోవునో అప్పుడు ఆ జీవుడు పరమాత్మతో కైవల్యమును పొందును. కొందరు గంజాయి మొదలగు మత్తు పదార్ధములను వాడి ఈ "నేను" ను మరచిపోవుచున్నారు కాని ఇది కైవల్యము కాదు. గంజాయి మత్తు దిగగానే ఈ "నేను" మరల ఉద్భవించుచున్నది. గాఢనిద్రలో కూడ "నేను" లయించుచున్నది. కాన గాఢనిద్ర కైవల్యము కాదు. కావున కేవలము రాధ మాత్రమే నిజమైన కైవల్యము పొందినది. కావున నరాకారములో నిజమైన పరబ్రహ్మమును గుర్తించుటయే నిజమైన బ్రహ్మ విద్య. ఆ గుర్తింపుకే అనేక బాలారిష్టములున్నవి. ఆయన ఆశ్రయించిన నరశరీరము అన్ని నరశరీరముల వలే ప్రకృతి ధర్మములకు లోబడి యుండును. మనవలే ఆయనకు కూడ క్షుత్విపాసలు, దగ్గు, రొంప వచ్చుచుండును. ఈ బాహ్య లక్షణములను చూచి చాలా మంది మోసపోవుదురు. ఒకవేళ గుర్తించినను ధర్మమును తప్పిన నడకతో గోచరించుచుండును. ఆ దెబ్బతో గుర్తించిన వారు కూడ అరటి తొక్కపై కాలు పడినట్లు జారిపోవుచుందురు. ఆయనను గుర్తించు లక్షణములు కూడ ఎంతో తికమక ఉన్నది. సిద్ధులు గుర్తుగా పెట్టుకున్నచో రాక్షసులు, క్షుద్రమాంత్రికుల వలలో పడుదురు. జ్ఞానమును గుర్తుగా పెట్టుకున్నచో పండితుల వలలో చిక్కుకొందురు.

పండితులు చెప్పు జ్ఞానము బ్రహ్మానుభూతిని కలిగించలేదు. ఆయన యొక్క కల్యాణ గుణములలో కొన్ని కొన్ని గుణములు భక్తుల వద్ద కూడ కనిపించుచుండును. భగవంతుని నుండి భక్తులను వేరుచేయుట చాలా కష్టముగా యుండును. ఏలననగా సత్య భక్తులను భగవంతుడు ఆవేశించి యుండును. అయితే ఒక కార్యార్ధమై భగవంతుడు భక్తులను ఆవేశించును. ఆ కార్యము ముగియగనే, భగవంతుడు భక్తుల నుండు తొలగిపోవును. భక్తుడు, ముని కుమారుడైన పరశురాముని విష్ణుభగవానుడు ఆవేశించి సర్వ క్షత్రియ సంహారమును చేసెను. ఆ కార్యము ముగియగనే పరశురాముని నుండి తొలగిపోయెను. కావున ఇట్టి మహాభక్తులను నరావతారముల నుండి వేరుచేయుట కష్టము. ఒక్కొక్క సారి నరావతారుడగు స్వామి తన శక్తిని భక్తుని ద్వారా ప్రయోగించి వారి సాయమును తాను పొందుచు వారికి భగవంతునిగా కీర్తి నిచ్చి తాను భక్తుని స్ధానమున ఉండి నటించుచుండును. సంజీవి పర్వతమును హనుమంతుడు తెచ్చి లక్ష్మణుని బ్రతికించి, రాముని శోకమును పోగొట్టెను. రామశక్తి వలననే హనుమంతుడు సంజీవిని తెచ్చెను. చూచు వారికి హనుమంతుడే భగవంతుడు, రాముడే భక్తుడిగ తోచును. ఇట్టి మాయలను తప్పించుకొని ఆయనను గుర్తించుట చాలా కష్టము. గోటి చుట్టుపై రోకలి పోటు అన్నట్లు, వెన్నముద్దలు దొంగిలించుచూ, గోపికల వెంటబడుచు, అందరి విమర్శలకు గురియగుచు భక్తుల కండ్లకు మాయ పొరలను కప్పుచుండును. దీనికి తోడు సాక్షాత్తు నారాయణుని నుండి అసలు శంఖ, చక్రములనే సంపాదించిన ఈ నకిలీ నారాయణుల నుండి జారచోరత్వాది మాయలచే గప్పబడిన సత్యనారాయణుని గుర్తించుట చాలా కష్టము. సత్యనారాయణ వ్రతములో అంతరార్ధమిదే. సత్యనారయణ వ్రతములో గోవిందాది కృష్ణ నామములే ఉన్నవి. అనగా ఈ నరులలో సత్యమైన నారాయణుని గుర్తించి జారిపోకుండా గట్టిపట్టుతో దీక్షను పూనిన వాడే నిజముగా సత్యనారాయణ వ్రతము చేసినవాడు. ఈ విధముగా గొర్రెలలో కలసిపోయి గొర్రతోలు కప్పుకొని గొర్రె స్వరముతో అరచుచు గొర్రెలలో కలసిపోయిన పులిని గుర్తించుటయే బ్రహ్మవిద్య. గొర్రెల కన్న వేరుగా నున్న పులిని గుర్తించుటలో కష్టమేమున్నది? కావున జీవుని కన్న భిన్నముగా వున్న భగవంతుని గుర్తించుటలో కష్టము లేదు. అన్ని గొర్రెలను పులియే అన్ననూ కష్టము లేదు. ప్రతి గొర్రెయును పులియే గదా. కావున సర్వజీవులను బ్రహమే అన్నప్పుడు కష్టములేదు. కావున ఇటువంటి అతితెలివి సిద్ధాంతముల భ్రమల నుండి బయిటపడి గొర్రె వేషముతో గొర్రెలలో కలిసిపోయి గొర్రెగా ఉన్న పులిని గుర్తించుటయే బ్రహ్మవిద్య. కావున నరవేషముతో నురులతో కలసిపోయిన నారాయణుని గుర్తించుటయే మహా మహా కష్టము. కావున అనేక జన్మలు పట్టును. నరావతారమున ఉన్న రాముని గుర్తించి పూర్తిగా విశ్వసించిన హనుమంతుడును, అట్లే నరావతారమున ఉన్న కృష్ణుని గుర్తించి పరిపూర్ణ విశ్వసించిన రాధయును, వీరువురే బ్రహ్మవిద్యను పూర్తిగా తెలిసిన బ్రహ్మ జ్ఞానులు.

At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

Friday, June 18, 2010

అంతరార్ధమును బోధించాలి

"మచ్ఛిత్తా మద్గత ప్రాణాః బోధయంతః పరం పరం కద్గయన్తశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతిచ" అని అన్నారు స్వామి భగవద్గీతలో. దీని అర్ధము నా యందే మనస్సును ప్రాణములను నిలిపి నా గురించి ఒకరికి ఒకరు చెప్పుకొనుచు ఆ కధలలోని నా తత్వమును లేక అంతరార్ధమును బోధించుకొనుచు ఆనందముతో నా భక్తులు నిత్యము రమించు చుందురు అని ఈ శ్లోకార్ధము. మనస్సు పరమాత్మ యందు ఎప్పుడు లగ్నమగునో అప్పుడే స్వామికి నీ వాక్కు, దేహము, ప్రాణములు కూడ అర్పించ బడుచున్నవి. ప్రాణము వాయు స్వరూపమై యున్నది. మరణించిన తర్వాత శ్వాస ఆగిపోవుచున్నది. ఈ శ్వాసయే వాయువు కావున ప్రాణము అనగా వాయువు పంచభూతములలో ఒకటి. పంచభూతమైన ఈ శరీరములో వాయువు కూడ ఒక భాగమే. కావున ప్రాణము కూడ దేహము అను శబ్ధములోనికే వచ్చుచున్నది. "దహ్యతే ఇతి దేహః" ఎదో ఒక సమయమున దహించబడవలసినదే అని దేహ శబ్ధమునకు అర్ధము. కావున ఈ దేహమును స్వామి కొరకు దహనము కావించిన గోపికలు ధన్యులు. స్వామి నిర్యాణము చెందినారని వినగనే గోపికలు అగ్నిలో దూకి తమ దేహములను దగ్ధము చేసినారు. కాని అందరు గోపికలు అట్లు చేయలేకపోయినారు. మిగిలిన గోపికలను అర్జునుడు తీసుకొని వచ్చుచుండగా దారిలో కిరాతకులు కొల్లగొట్టి ఆ గోపికలను అపహరించుకొనిపోయి హింసించి చంపి తిన్నారు. అగ్నిలో దూకిన గోపికలు నేరుగా గోలోకమునకు పోయినారు. దేహము మీద మమకారమున్న గోపికలు కూడ నాలుగు దినములలో మరణించినారు. కాని వారు గోలోకమునకు పోలేదు. వారికి స్వామిపై నున్న మమకారము కన్న వారి దేహములపై మమకారము ఎక్కువగా యున్నది. కొందరికి ఈ దేహ సంబంధమున్న ఇతర జీవులపై మమకారముండును. కొందరు స్త్రీలు భర్తలతో పాటు సహగమనము చేసెడివారు. ఈనాడు రాజకీనాయకుడు యొక్క వీరాభిమాని తనను తాను దహనము చేసుకొనుచున్నాడు. కావున దేహబంధము దేహమునకు సంభంధించిన వ్యక్తుల బంధము, దేహ బంధము లేకపోయినను, తాను అభిమానించిన వ్యక్తిపై బంధము. ఇట్లు అనేక విధములైన వ్యామోహములు జీవుని చుట్టిముట్టి యున్నవి. స్వామి మానవ శరీరమును తాల్చి కృష్ణ పరమాత్మగా వచ్చినపుడు స్వామిపై కూడ భక్తులకు బంధము ఏర్పడును. ఈ బంధము జీవుని యొక్క అన్ని బంధములతో పోటిపడును. ఈ పోటీలో స్వామి బంధముతో సమానమైన బంధము ఏ ఇతర జీవుల మీద కాని, ఏ వస్తువుల మీద కాని చివరకు తన దేహము మీద కాని కూడ లేదని నిరూపించిన జీవుడే దత్త పరీక్షలో పూర్ణముగా ఉత్తీర్ణుడగుచున్నాడు. దీనినే శ్రుతి "నతన్‌ సమశ్వా ద్యది కశ్చ సూర్యతే" అనగా ఆయనతో సమానమైన వస్తువు కాని వ్యక్తి కానిలేదు. ఇక ఆయనకు మించిన వస్తువు గాని, వ్యక్తిగాని ఎట్లుండును అని అర్ధము.

పట్టాభిషేక సమయమున జానకీదేవి యిచ్చిన ముత్యాల హారమును హనుమంతుడు చూచి కొరికి పారవేయుచున్నాడు. జానకీ మాతను అట్లు అవమానించి నందులకు సభ్యులకు కోపమువచ్చినది. వారందరు ఇది ఏమి పనియని కోపముతో కేకలు పెట్టినారు. ఈ ముత్యములలో రాముడు లేడని పారవేయుచున్నాను అని హనుమంతుడు పలికెను. అట్లైనచో నీ హృదయములో రాముడు ఉన్నాడా అని వారు అడిగినారు. హనుమంతుడు తన గోళ్ళతో తన హృదయమును చీల్చి రాముని చూపినాడు. ఈ కధను చెప్పుకొనుటయే శ్లోకములో "కధయంతశ్చ" అని చెప్పబడినది. కాని కధను మాత్రమే శ్రవణము చేయుట పురాణ శ్రవణమగును. దీని వలన పెద్ద ప్రయోగము లేదు. అందుకే "బోధయంతః" అన్నారు. అనగా ఆ కధలోని అంతరార్ధమును బోధించవలెను. కధ లేక కేవలము వేదాంత తత్త్వబోధ భాష్య ప్రవచనమందురు. ఇది పండితులకు మాత్రమే ఆనందమును కలలిగించును. పామరులకు కేవలము కధ మాత్రమే ఆనందము కలిగించును. ఒకటి అతివృష్టి మరియొకటి అనావృష్టి. ఈ రెండింటి యొక్క మిశ్రమమే సత్సంగము అందురు. ఇందులో కధాశ్రవణము, జ్ఞానబోధ రెండూ ఉండును. ఈ రెండింటిని సమన్వయము చేసినపుడే అటు పామరులకు అటు పండితులకు ఈ రెండింటి మధ్య వారికి పరిపూర్ణ ఆనందము లభించును. ఇట్టి సత్సంగము నందు దేవలోకములోని అమృతము కూడ దిగదుడుపే అగును. ఋషులు పురాణములు శాస్త్రములు వ్రాసినారు. ఈ రెండింటి సమన్వయములే ఉపనిషత్తులు. వీటిని వేదాంతము లందురు. అనగా జ్ఞానము యొక్క శిఖరాగ్రస్ధాయిలో ఉన్నవి అర్ధము. ఇంతకునూ ఇప్పుడు చెప్పిన కధలో జ్ఞానబోధ ఏమి? హనుమంతునకు ముత్యములలో రాముడు ఎందుకు కనిపింలేదు? సర్వ జగత్తులో పరమాత్మ ఉన్నప్పుడు ముత్యములలో ఏల లేడు? "నేతి నేతి ద్వివిధః" అని శ్రుతి చెప్పుచున్నది. అనగా ఇది కాదు, ఇది కాదు అని సృష్టిలోని ప్రతి వస్తువును త్యజించినారు అని శ్రుతికి అర్ధము. గీతలో కూడ "నా హంతే స్వదక్షితః" అన్నారు స్వామి. అనగా ఈ జగత్తులో దేని యందునులేను అని అర్ధము. మరియొక చోట గీతలో "నత్వహంతేషు తేమయీ" అన్నారు. అనగా ఈ జగత్తులో నేనెక్కడను లేను. ఈ జగత్తు నాలో ఉన్నది అని అర్ధము. మరియొక చోట గీతలో "యయేదం ధారయతే జగత్‌" అన్నారు. ఈ జగత్తును నేను ధరించి ఉన్నాను అని అర్ధము. కావున పరమాత్మ జగత్తుకు ఆధారంగా ఉన్నాడు. అంతే కాని జగత్తులో ఏ వస్తువునందును ఏ వ్యక్తి యందును పరమాత్మ లేడు.

ఈ జగత్తుకు పరమాత్మకు ఆధేయ ఆధార సంబంధము ఉన్నదని శ్రీ రామానుజా చార్యులు తన భాష్యములో స్ధాపించినారు. అనగా బల్ల ఆధారము. బల్ల మీద ఉన్న వస్తువులు ఆధేయములు. వస్తువులలో బల్ల లేదు. బల్లలో కూడ వస్తువులు లేవు. కావున వస్తువులలోని వికారము బల్లకు అంటవు. ఈ తత్త్వమును నిరూపించుట కొరకే హనుమంతుడు ముత్యములను కొరికి పారవేసినాడు. కాని నీలో పరమాత్మ ఉన్నదా? అని సభ్యులు ప్రశ్నించినపుడు నాలో పరమాత్మలేనిచో ఈ దేహము కూడ వ్యర్ధమే. నాకు అక్కర లేదు అని తన గోళ్ళతో హృదయమును చీల్చినాడు. ఆ గోళ్ళు గుండెలోనికి దిగబడి గుండెకాయ ముక్కలు ముక్కలుగా చీలినది. అనగా స్వామి కొరకు ప్రాణార్పణము చేసినాడు. ఇదే "మద్గత ప్రాణాః" అని శ్లోకములో చెప్పబడినది. ఆ విధముగా గుండె చీల్చి ప్రాణత్యాగము చేయుటకు సభ్యులు ఎవ్వరును సాహసించలేదు. ఏలననగా, వారిలో పరమాత్మ లేడు. అప్పుడు హృదయమున రాముడు గోచరించినాడు. అనగా మహా భక్తుడగు హనుమంతుని యందు పరమాత్మ ఉన్నాడని అర్ధము. "తన్మయాహితే" అను నారద భక్తి సూత్రము గలదు. దాని అర్ధము భగవంతుడు తన మహా భక్తులను ఆవేశించి యుండును. అట్టి మహా భక్తుడు ఎవరు? భగవంతుని కొరకు ప్రాణములను తృణముగా గణించు వాడే మహా భక్తుడు. భక్తులను భగవంతుడు ఆవేశించి యుండుట ఆవేశావతారమని చెప్పబడును.

పరమాత్మ భక్తుల యొక్క సాధనలో సాయపడుటకు ఒక మనుష్య శరీరము ధరించి వచ్చును. అదియే రామావతారము. అట్టి మనుష్య శరీరములో ప్రత్యేకమైన జీవుడు ఉండడు. అట్టి శరీరము ఒక వ్యక్తి ధరించిన చొక్క వంటిది. ఆవేశావతారము అట్లు కాదు. ఒక శరీరము చొక్కలోకి ఆ ధరించిన వ్యక్తితో పాటు మరియొక వ్యక్తి దానిలోకి దూరుట. వర్షములో ఒక పెద్ద రైన్‌కోటులో దూరి ఇరువురు కలసి వచ్చుట మనము చూతుము. ఇదే ఆవేశావతారము. అనగా హనుమంతుని శరీరము అను చొక్కలో హనుమంతుడు అను జీవుడు ఉన్నాడు. దాని లోనికి రామ శరీరమను చొక్కను ధరించిన పరమాత్మ దూరినాడు. దీనినే ఋగ్వేదము ఇట్లు చెప్పుచున్నది. "ద్వా సుపర్ణా సఖాయ" అనగా ఒకే వృక్షమును మంచి మైత్రి కలిగిన రెండు పక్షులు కలసి ఆశ్రయించి ఉన్నవి అని అర్ధము. వృక్షము అనగా భక్తుని శరీరము. ఈ రెండు పక్షులే జీవాత్మ పరమాత్మలు. రాముని శరీరము కూడ వృక్షమే. దాని యందు పరమాత్మ పక్షి మాత్రమే ఉన్నది. హృదయమును చీల్చక ముందు హనుమంతుడు అను జీవుడు అనగా హనుమంతుని శరీరము అను వృక్షము నందు హనమమంతుడు అను జీవుడు ఒక పక్షే ఉన్నది. ఇప్పుడు హనుమంతుడు హృదయమును చీల్చినప్పుడు రామ శరీరముతో పాటు పరమాత్మ దర్శన మిచ్చినాడు. శరీరమును ఆశ్రయించనిచో దర్శనము అసంభవము. శరీరము పంచభూతములతో నిర్మించబడవచ్చును. మనుష్య శరీరము పంచభూతములై యున్నది. దేవతా శరీరములో కేవలము అగ్ని (తేజస్సు) అను ఒకే భూతము చేత నిర్మించబడినది. పిశాచ శరీరము కొన్ని కేవలము వాయువు చేతను, మరికొన్ని వాయువు చేరిన అగ్ని తేజస్సుచేతను మరికొన్ని వాయువు, తేజస్సు, జల కణముల చేతను నిర్మించబడియుండును. వాయు, తేజో జలములు కలసి నప్పుడు ఆ శరీరము ధూమ, శరీరములనబడును.

కావున పంచభూతములకు అతీతమైన అనగా సృష్టికి అతీతమైన పరమాత్మను దేవతాదులు సహితము దర్శింపజాలరు. దర్శనమే కాదు దేవతలకు సైతము ఊహించజాలక ఉన్నారు. అందుకే ఋగ్వేదము "కస్త్మేదేవాయ హవిహవిధేమ" అని చెప్పుచున్నది. అనగా ఆ దేవునకు ఎవరని నిర్ణయించి ఈ హవిస్సును ఇవ్వగలము అని అర్ధము. అది అందరాని బ్రహ్మము. శ్రీ రాముడు అందివచ్చిన బ్రహ్మము. హనుమంతుని హృదయములో కూడ నరాకారమును ధరించి వచ్చిన శ్రీ రాముడే కనిపించినాడు. హనుమంతుని హృదయములో కనిపించిన శ్రీ రాముడు తేజోమయమైన దేవతా శరీరముతో కనిపించినాడు. పంచ భూతమయమైన హనుమంతుని హృదయములో, పంచ భూతమయమైన రాముని శరీరము గోచరించుట ప్రకృతి నియమ విరుద్ధము. తేజోమయ శరీరము కనిపించుట కూడ ప్రకృతి నియమమునకు అతీతమై యున్నది. కావున వీలగునంత వరకు ప్రకృతి నియమములకు ఎక్కువ భంగము కాకుండగనే పరమాత్మ మహిమలు చేయును. కావున పరమాత్మ తేజోమయమైన దేవతా శరీరము కలిగి, అవతరించునపుడు మాతృ గర్భమున ఏర్పడిన పంచభూతమయ శరీరము తేజోమయ శరీరుడై ఆవేశించుచున్నాడు. ఆ తేజోమయ శరీరము యొక్క అవయవములు పంచభూత శరీర అవయవములలో ఇమిడిపోవును. ఇదే నేత్రమునకు నేత్రము అని కేనోపనిషత్తు చెప్పుచున్నది. హనుమంతుడు హృదయమును చీల్చినప్పుడు ఈ తేజోమయ శరీరము అణిమ యను సిద్ధి ద్వార సంక్షిప్తమై హృదయమున గోచరించినది. అవతార శరీరము, నిర్యాణము చెందినపుడు ఈ పంచభూత శరీరము నుండి ఆ తేజోమయ శరీరము వెడలిపోవును. అట్టి కృష్ణుని శరీరమునకు అర్జునుడు దహన సంస్కారములు కావించినాడు. కాని ఆ తేజోమయ శరీరము ఈ పంచభూత శరీరమును ఆపాదమస్తకము వ్యాపించి యున్నప్పుడు లోహపు తీగెను విద్యుత్తు వలె సంపూర్ణముగా వ్యాపించి యుండును. కావున అద్వైతమే. ఇదే అంది వచ్చిన పరబ్రహ్మము. విశ్వరూపమును ప్రదర్శించినపుడు ఈ తేజోమయ శరీరము మహిమ అను సిద్ధి ద్వారా అనంతమై గోచరించిది. ఆ తేజ శరీరము విశ్వమంతయు వ్యాపించి విశ్వమును తనలో చూపినది. ఆ తేజ శ్శరీరములో కురుక్షేత్రము కూడా ఉన్నది. ఆ కురుక్షేత్రములో పంచభూతమయమైన కృష్ణ శరీరము కూడ ఉన్నది. శ్రుతి "వివృణుతే తనూంస్వామ్‌" అని చెప్పుచున్నది. అనగా మహా భక్తుడు ఆ తేజోరూపమును చూడగోరినపుడు ఈ అవతార పురషుడు తనలో ఇమిడి ఉన్న ఆ చిన్న తేజోరూపము అను తనువును విస్తరించి ప్రకటించును. ఒక చిన్న వాక్యమునకు వ్యాఖ్యానించునపుడు ఎట్లు విస్తారమైన దాని యందున్న అర్ధము ప్రకటించబడునో అట్లు ప్రకటించబడును అని "వివృణుతే" అను క్రియా పదమునకు అర్ధము. ఆ యోగీశ్వర రూపము సహస్ర సూర్య తేజస్సుతో చేయబడినది అని చెప్పబడినది. "దివి సూర్య సహస్రస్య" అది నాశనము లేనిది కావునే "దర్శమాత్మాన మవ్యయం" అని చెప్పబడినది. పంచభూతములు విడిపోవచ్చును. కాని ఒకే భూతమగు తేజస్సు విడిపోదు. కావున నాశనము లేదు. మరల ఆ విశ్వము రూపము ఉపసంహరించినపుడు ఆ తేజో రూపము సంక్షిప్తమై కృష్ణుని శరీరమందు లీనమైనది. ఈ తేజో రూపము అవతార పురుషుని పంచభూత శరీరము నందు దాగి ఉండి ఒక్కొక్కసారి కొంచెము ప్రకటితమగుచుండును. అప్పుడు పంచభూత శరీరము కాంతితో వెలుగును. ఇదే ముచుకుందునకు కృష్ణుడు చూపిన దర్శనము. ఆ తేజో రూపము యొక్క తేజస్సు పంచభూత శరీరములోని ఒకానొక అవయవము నందే వ్యక్తము కావచ్చును. అదియే దివ్య దర్శనములు. కాని సాధకుడు వీటి గురించి భ్రమపడరాదు. ఏలననగా ఆ తేజస్సు జడమైన ఒక భూతమే కదా! మనము సూర్య తేజస్సు లోకములో చూచుచునే ఉన్నాము గదా. దృతరాష్ట్రుడును విశ్వరూపమును దర్శించెను. కాని ప్రయోజనమేమి? రాధ ఎప్పుడును ఇట్టి దర్శనమును పొందలేదు. ఆయనలో ఆ తేజస్సు కన్నను చైతన్యమయమైన ఆయన ప్రేమ చాలా గొప్పది. దానిని ప్రకటింప చేసిన సాధకుడు ధన్యుడు.

At the lotus feet of Shri Datta swami
-Durgaprasad